Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కబీర్ సింగ్ ఎఫెక్ట్... సందీప్ వంగా కోసం క్యూ కడుతున్న నిర్మాతలు!
'కబీర్ సింగ్' చిత్రం షాహిద్ కపూర్కు ఎంత పేరు తెచ్చిందో... ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్రెడ్డి వంగాకు అదే స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. కొందరు సినిమా క్రిటిక్స్ తన మూవీపై విమర్శలు చేయడం, వారిపై సందీప్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే.
అయితే క్రిటిక్స్ అభిప్రాయాలను తలక్రిందులు చేస్తూ....'కబీర్ సింగ్' సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దీంతో బాలీవుడ్ నిర్మాతలు సందీప్ వంగాతో సినిమాలు చేయడానికి వెంట పడుతున్నారట. 'కబీర్ సింగ్' దాదాపు రూ. 300 కోట్ల వరకు వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తుండటంతో సందీప్ వంగా... ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అతడికి హైదరాబాద్లో సొంతగా ఫ్లాట్ ఉంది. అయితే 'కబీర్ సింగ్' మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ ఉపయోగించుకుని బాలీవుడ్ ఎదగాలనే ప్లాన్లో ఉన్నారట.
ఇటీవల ఆయన బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... తనకు మరిన్ని హిందీ సినిమాలు చేసే ప్లాన్స్ ఉన్నాయి, ముంబైలో పెద్ద ఆఫీస్, ఇల్లు కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. సందీప్ తన తర్వాతి సినిమా క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఘనత గతంలో రామ్ గోపాల్ వర్మ సొంతం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి హైప్ మళ్లీ సందీప్ రెడ్డి 'కబీర్ సింగ్' మూవీ ద్వారా సందీప్ సొంతం చేసుకున్నాడు.