Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ఆచార్య’లో సంగీతది గెస్ట్ రోల్ కాదట: బయటకు వచ్చిన సర్ప్రైజింగ్ న్యూస్
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆచార్య'. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో సందేశాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హై లెవెల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని సంగీత పాత్ర గురించి ఓ సర్ప్రైజింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
కొద్ది రోజుల క్రితం 'ఆచార్య' మూవీ నుంచి లాహే లాహే అంటూ సాగే ఓ పాట విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ సంగీత తళుక్కున మెరిసింది. దీంతో ఈ చిత్రంలో ఆమె నటిస్తుందా? లేక ఈ పాటకే పరిమితమైందా అని చర్చలు సాగాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో సంగీతం అత్యంత కీలకమైన ధర్మస్థలి నర్తకి పాత్రను పోషిస్తుందట. ఎంతో హైలైట్గా ఉండే ఈ రోల్.. ఇంటర్వెల్కు ముందు జరిగిన ఓ యాక్షన్ సీన్లో చనిపోతుందని తెలుస్తోంది. కానీ, ఉన్నంత వరకూ ఆమె అద్భుతమైన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.
భారీ బడ్జెట్.. ఉన్నత విలువలతో రూపొందుతోన్న 'ఆచార్య' షూటింగ్ కొంత భాగం చిత్రీకరణ జరగాల్సి ఉంది. అది ఈ నెల చివర్లోనే వచ్చే నెల ఆరంభంలోనే జరుగుతుందని తెలుస్తోంది. అది అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి.. వీలైనంత త్వరగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నాలు జరుపుతున్నారట. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా చేస్తోన్నారు. ఈ సినిమాకు మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.