Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'అంటార్కిటికా'ని టార్గెట్ చేసిన సంకల్ప్ రెడ్డి.. మరో ప్రయోగం!
ఘాజి చిత్రంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఘాజి చిత్ర తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలై విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం అందించిన స్పూర్తితో రిస్క్ అయినా కూడా అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో వరుణ్ తేజ్ తో అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది.
అయినా కూడా సంకల్ప్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. విభిన్నమైన, యూనివర్సల్ కథలతోనే సినిమాలు రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సంకల్ప్ రెడ్డి తదుపరి చిత్రం మంచు ఖండం అంటార్కిటికా నేపథ్యంలో ఉండబోతోందట. ఈ చిత్రంలో హీరో అంటార్కిటికా రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ కావడం, అక్కడ అతడు ఎదుర్కొనే సవాళ్లతో సంకల్ప్ రెడ్డి ఉత్కంఠ భరితమైన కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ సంకల్ప్ రెడ్డి తన తదుపరి చిత్ర విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో ఈచిత్రం గురించి పూర్తి వివరాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ అంశాల లేకుండా కూడా మంచి కథతోప్రేక్షకులని మెప్పించవచ్చు అనే ధీమాతో సంకల్ప్ రెడ్డి ఉన్నాడు.