Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరో విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సంకల్ప్ రెడ్డి
తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి తొలి సినిమా 'ఘాజీ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదలై మంచి విజయం అందుకుంది.
అయితే 'అంతరిక్షం' పేరుతో సంకల్ప్ రెడ్డి చేసిన రెండో ప్రయత్నం బాక్సాఫీసు వద్ద విజయం అందుకోలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి నిర్మించారు.
'అంతరిక్షం' తర్వాత సంకల్ప్ రెడ్డి మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ సారి తెలుగులోనే కాదు.. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్టుపై అతడు దృష్టి పెట్టాడని, ప్రస్తుతం స్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అంటార్కిటికా ఖండం నేపథ్యంలో అడ్వెంచరస్ చిత్రంగా ఇది ఉండబోతోందట. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.