Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సంకల్ప్ రెడ్డి
తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి తొలి సినిమా 'ఘాజీ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా విడుదలై మంచి విజయం అందుకుంది.
అయితే 'అంతరిక్షం' పేరుతో సంకల్ప్ రెడ్డి చేసిన రెండో ప్రయత్నం బాక్సాఫీసు వద్ద విజయం అందుకోలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి నిర్మించారు.
'అంతరిక్షం' తర్వాత సంకల్ప్ రెడ్డి మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ సారి తెలుగులోనే కాదు.. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్టుపై అతడు దృష్టి పెట్టాడని, ప్రస్తుతం స్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అంటార్కిటికా ఖండం నేపథ్యంలో అడ్వెంచరస్ చిత్రంగా ఇది ఉండబోతోందట. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.