Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా క్రైసిస్ ఛారిటీ.. సప్తగిరి ఆర్థిక సాయం ఎంతంటే..?
కమెడియన్గా ప్రస్థానం మొదలు పెట్టిన సప్తగిరి.. హీరోగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోగా కామెడీ చిత్రాలను ట్రై చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. అయినా సరే వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంలో మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కమ్రంలోనే సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని చిరంజీవి ప్రారంభించాడు.
లాక్ డౌన్ నేపథ్యంలో పని దొరక్క అల్లాడుతున్న సినీ శ్రామికులకు అండగా ఉండేందుకు చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ.. కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించాడు. చిరు పిలుపు మేరకు టాలీవుడ్ అంతా కదిలి వస్తూ ఎవరికి తోచిన సాయాన్ని వారు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, ప్రభాస్ 50 లక్షలు, ఎన్టీఆర్ 25 లక్షలు, రామ్ చరణ్ 30 లక్షలు, మహేష్ బాబు 25 లక్షల సాయాన్ని ప్రకటించారు.
కేవలం హీరోలు మాత్రమే కాకుండా.. దర్శకులు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటించారు. సంపూర్ణేశ్ బాబు, వెన్నెల కిషోర్ వంటి వారు కూడా చేతనైనా సాయాన్ని ప్రకటించారు. తాజాగా సప్తగిరి సైతం ఓ చేయి వేశాడు. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీకి రెండు లక్షల విరాళాన్ని ప్రకటించాడు.