Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్.. మహేష్ రేంజ్ అంటే ఇదీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో 26వ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలోనే భారీ హైప్ తెచ్చుకుంది. ఈ హైప్ ప్రభావం ప్రీ రిలీజ్ బిజినెస్పై పడటంతో ఓ రేంజ్ బిజినెస్ జరిగింది. ఆ వివరాలు చూద్దామా..
సరిలేరు నీకెవ్వరు అనేలా అప్డేట్స్
సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే 'సరిలేరు నీకెవ్వరు' అనేలా అప్డేట్స్ ఇస్తూ వచ్చారు యూనిట్ సభ్యులు. ఎప్పటికప్పుడు మహేష్ ఫ్రెష్ లుక్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయన అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో ఈ సంక్రాంతికి మహేష్ హంగామా ఫుల్లుగా ఉంటుందని ఫిక్సయ్యారంతా. ఈ ఎఫెక్ట్తో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.
100 కోట్లు దాటిన మహేష్..
తాజాగా అందిన సమాచారం మేరకు అని ఏరియాల్లో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. మొత్తంగా చూస్తే అన్ని ఏరియాల్లో కలిపి 101. 25 కోట్ల రూపాయలకు ఈ థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయని తెలిసింది.
విదేశాల్లో కూడా సరిలేరు నీకెవ్వరు
ఇదిలాఉంటే సరిలేరు నీకెవ్వరు ప్రీమియర్ షోస్కి విదేశాల్లో భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. మహేష్ కెరీర్లో ఎన్నడూలేని విధంగా చాలా లొకేషన్స్లో ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించబడనున్నాయి. యూఎస్ మార్కెట్ బిగ్గెస్ట్ ఇండియన్ రిలీజ్ మూవీగా సరిలేరు నీకెవ్వరు విడుదల కాబోతుండటం విశేషం.
విడుదలకు వారం ముందు.. మునుపెన్నడూ చూడని విధంగా
మరోవైపు జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట చిత్రయూనిట్. జనవరి 5వ తేదీన భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారట దర్శకనిర్మాతలు. తెలుగు చిత్రసీమలో మునుపెన్నడూ చూడని విధంగా అట్టహాసంగా ఈ ఈవెంట్ నిర్వహించాలని మహేష్ బాబు చెప్పినట్లుగా తెలుస్తోంది.
Recommended Video
'సరిలేరు నీకెవ్వరు' మహేష్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.