Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రికార్డు ధరకు సరిలేరు నీకెవ్వరూ శాటిలైట్.. సెట్స్లో ప్రిన్స్ కాలుపెట్టకుండానే!
మహర్షి లాంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. F2 లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అనిల్ రావిపూడి డైరెక్టర్. దేవదాస్, గీతా గోవిందం చిత్రాలతో అలరించిన రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమా ఇటీవలే సెట్స్పైకి వెళ్లింది. ఇంకా మహేష్ బాబు సెట్లోకి అడుగుపెట్టలేదు కానీ.. సినిమా బిజినెస్ అప్పుడే మొదలైపోయింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరూ సినిమా శాటిలైట్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది అని తెలిసింది. ఫ్యాన్సీ రేటుకు జెమిటీ టీవీ దక్కించుకొన్నది. ఈ విషయాన్ని జెమినీ టీవీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అనిల్ రావిపూడి, మహేష్ బాబు, రష్మిక మందన్న కాంబినేషన్లో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రసార హక్కులను జెమినీ టెలివిజన్ కొనుగోలు చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం అని జెమినీ టీవీ ట్వీట్ చేసింది.
కాగా, సరిలేరు నీకెవ్వరూ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 5 తేదీ నుంచి జరుగనున్నది. ఈ చిత్రంలో మహేష్ బాబు జవాను పాత్రలో కనిపిించనున్నారు. ఇక ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్రను పోషిస్తున్నారు. విజయశాంతి మళ్లీ 17 ఏళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకోవడం గమనార్హం.
సరిలేరు నీకెవ్వరూ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు, మహేష్ బాబు ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానున్నది.