Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రికార్డు ధరకు సరిలేరు నీకెవ్వరూ శాటిలైట్.. సెట్స్లో ప్రిన్స్ కాలుపెట్టకుండానే!
మహర్షి లాంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. F2 లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అనిల్ రావిపూడి డైరెక్టర్. దేవదాస్, గీతా గోవిందం చిత్రాలతో అలరించిన రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమా ఇటీవలే సెట్స్పైకి వెళ్లింది. ఇంకా మహేష్ బాబు సెట్లోకి అడుగుపెట్టలేదు కానీ.. సినిమా బిజినెస్ అప్పుడే మొదలైపోయింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరూ సినిమా శాటిలైట్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది అని తెలిసింది. ఫ్యాన్సీ రేటుకు జెమిటీ టీవీ దక్కించుకొన్నది. ఈ విషయాన్ని జెమినీ టీవీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అనిల్ రావిపూడి, మహేష్ బాబు, రష్మిక మందన్న కాంబినేషన్లో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రసార హక్కులను జెమినీ టెలివిజన్ కొనుగోలు చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం అని జెమినీ టీవీ ట్వీట్ చేసింది.
కాగా, సరిలేరు నీకెవ్వరూ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 5 తేదీ నుంచి జరుగనున్నది. ఈ చిత్రంలో మహేష్ బాబు జవాను పాత్రలో కనిపిించనున్నారు. ఇక ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్రను పోషిస్తున్నారు. విజయశాంతి మళ్లీ 17 ఏళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకోవడం గమనార్హం.
సరిలేరు నీకెవ్వరూ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు, మహేష్ బాబు ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల కానున్నది.