Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెలెబ్రేషన్ మూడ్లో సరిలేరు.. మహేష్, అనిల్ రావిపూడి ట్వీట్స్ వైరల్.
సూపర్ స్టార్ మహేష్బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శనివారం (జనవరి 11) విడుదలైంది. ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ను సొంతం చేసుకుంది. మహేష్ తన కామెడీ టైమింగ్తో పాటు, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ను కూడా అదరగొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లపై భారీగానే కన్నేసింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80శాతం థియేటర్లలో సరిలేరును రిలీజ్ చేశారు. అయితే మొదటి రోజు వసూళ్ల లెక్కలను చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 32 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రకటించారు.
అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సందర్భంగా మహేష్.. చిత్రబృందానికి గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మహేష్.. 'బ్లాక్ బస్టర్ పార్టీ.. సెలబ్రేషన్స్ బిగిన్' అని ట్వీట్ చేశాడు. ఇదే ఫోటోను షేర్ చేసిన అనిల్ రావిపూడి 'మీ విజిల్స్కి, మీ రెస్పాన్స్కి, మీ అభిమానానికి టేక్ ఏ బో' అంటూ పోస్ట్ చేశాడు.