Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు ఫ్యాన్స్కి సర్ప్రైజ్.. అదిరిపోయేలా ఇండిపెండెన్స్ డే గిఫ్ట్
వరుస సినిమాలతో మంచి జోష్లో ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన 25 వ సినిమా 'మహర్షి' సక్సెస్ తో మాంచి ఫామ్లో ఉన్న ఆయన 26వ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇండిపెండెన్స్ డే కానుకగా అదిరిపోయే వీడియో రిలీజ్ చేసి మహేష్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది 'సరిలేరు నీకెవ్వరు' చిత్రయూనిట్.
భారత సైన్యానికి నివాళి
దేశం కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతూ దేశ సేవలో భాగమవుతున్న భారత సైన్యానికి నివాళిగా పేర్కొంటూ ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రయూనిట్. సైనికుల గొప్పతనాన్ని వివరిస్తూ ‘సరిలేరు నీకెవ్వరు' అంటూ సాగిపోతున్న ఈ వీడియోలో 1971 ఇండో-పాక్ వార్, సియాచిన్ వివాదం, కార్గిల్ యుద్ధం, 2016 సర్జికల్ స్ట్రైక్స్ సన్నివేశాలను చూపించారు.
భారత సైన్యం విలువ తెలిసేలా
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. అజయ్ కృష్ణ అనే మేజర్ రోల్లో మహేష్ నటన ఆకట్టుకోనుంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం విలువ తెలిసేలా అదిరిపోయే వీడియో రిలీజ్ చేసింది 'సరిలేరు నీకెవ్వరు' చిత్రయూనిట్. ఈ వీడియోలో వస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాహిత్యం రోమాలు నిక్కపొడిచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
అప్పుడలా.. ఇప్పుడిలా
ఇటీవలే మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా నుంచి ఆయన లుక్ రివీల్ చేస్తూ సర్ప్రైజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ వీడియోతో మరో సర్ప్రైజ్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు. మేజర్ అజయ్ కృష్ణ పర్ఫార్మెన్స్ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని తెగ ఆత్రుతగా ఉన్నారు.
సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్రాజు, మహేశ్బాబులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.