Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆర్మీ ఆఫీసర్గా మహేష్ బాబు.. ఎమోషనల్గా లేఖ రాసిన విజయశాంతి
మహర్షి భారీ విజయం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. F2 లాంటి సక్సెస్ను అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటించింది. దిల్ రాజు, ఏకే ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటిలానే సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ దూరంగా ఉండగా, ప్రముఖ దర్శకులు కే రాఘవేంద్రరావు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఆయన ఇమేజ్కు, బాడీ లాంగ్వేజ్కు తగినట్టుగా కథను, టైటిల్ను పెట్టాం అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావడం తథ్యం. విజయశాంతి కీలక పాత్రలో కనిపిస్తారు అని అనిల్ రావిపూడి చెప్పారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన విజయశాంతి ఓ లేఖను పంపారు. సూపర్స్టార్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. 160 చిత్రాల తర్వాత కొంత విరామం తీసుకొని మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను. 13 ఏళ్ల రాజకీయ జీవితం అనంతరం చేస్తున్న సినిమా ఇది. కృష్ణగారి కుమారుడు మహేష్ బాబుతో సినీ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం హ్యాపీగా ఉంది అని విజయశాంతి లేఖ రాశారు. ఈ లేఖను దర్శకుడు అనిల్ రావిపూడి చదివి వినిపించారు. ఈ సినిమా సంక్రాంతి 2020కి రిలీజ్ అవుతుంది.