Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Mind Block Song: మహేష్ బాబు మండే సర్ప్రైజ్.. ఆగలేకపోతున్న ఫ్యాన్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు మండే సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అభినామానులు ఉర్రుతలూగేలా ఫస్ట్ మండే సర్ప్రైజ్ సిద్ధం చేశారు 'సరిలేరు నీకెవ్వరు' మేకర్స్. ఈ సర్ప్రైజ్ మహేష్ బాబు అభిమానులకు మైండ్ బ్లాక్ చేయనుందట. దీనికి ముహూర్తం ఈ రోజు (డిసెంబర్ 2) పెట్టేశారు. ఆ వివరాలు చూద్దామా..
మిస్మరైజ్ చేసేలా వరుస అప్డేట్స్
ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. టీజర్ రిలీజ్ చేసి బ్రహ్మండమైన కిక్ స్టార్ట్ ఇచ్చేసింది. ఆపై పలు పోస్టర్స్ ద్వారా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు జనం. ఈ తరుణంలో ఇకపై ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకలోకాన్ని మిస్మరైజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్.
సోమవారం స్పెషల్.. మహేష్ కిక్
ఈ మేరకు సరికొత్త ప్లాన్ రచించారు 'సరిలేరు నీకెవ్వరు' దర్శకనిర్మాతలు. మాస్ మహేష్ బాబు మండేస్ పేరుతో ఇకపై వారానికి ఒకటి చొప్పున ప్రతి సోమవారం అప్డేట్ ఇచ్చేలా డిసైడ్ అయ్యారు. ఈ అప్డేట్స్లో పాటలు, కౌంట్డౌన్ పోస్టర్స్, గ్లింప్స్, వీడియోస్, ట్రైలర్ అన్నీ ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ మండే ముస్తాబయింది.
ఆగలేకపోతున్న ఫ్యాన్స్.. మైండ్ బ్లాక్
ఈ నేపథ్యంలో 'సరిలేరు నీకెవ్వరు' మొదటి పాట ''మైండ్ బ్లాక్''కి ముహూర్తం పెట్టేశారు. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ మహేష్ అభిమానులకు మైండ్ బ్లాక్ చేయడం ఖాయం అని తెలుస్తుండటంలో ఆయన ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు.
|
ఐదు సోమవారాలు.. ఐదు పాటలు
ఈ సోమవారం మొదలుకొని ఐదు సోమవారాల్లో ఐదు పాటలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు ఈ హంగామా కొనసాగనుంది. దీంతో నెల ముందుగానే మహేష్ అభిమానులకు సంక్రాంతి పండగ వచ్చినట్లయింది.
Recommended Video
'సరిలేరు నీకెవ్వరు' మూవీ
అనిల్ సుంకర, దిల్ రాజులతో పాటు మహేష్ బాబు సంయుక్తంగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 11వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కానుంది.