Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సర్కారు వారి పాట’పై కరోనా ప్రభావం: నిర్ణయం మార్చుకున్న మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాం రూపొందిస్తోన్న ఈ సినిమాను బ్యాంకుల విషయంలో జరిగిన బడా స్కామ్ల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన ఎప్పుడో జరిగినప్పటికీ.. షూటింగ్ మాత్రం ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ దుబాయ్లో సక్సెస్ఫుల్గా జరిగింది. అక్కడ హీరో ఇంట్రడక్షన్ ఫైట్ సీన్స్తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, ఓ పాటను సైతం షూట్ చేసినట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం 'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అయింది. నగర శివారులోని శంకరపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్తో చిత్రీకరణ జరుపుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. కరోనా నేపథ్యంలో చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణ జరుపుతూ వచ్చారు. కానీ, రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో హీరో మహేశ్ బాబు సూచన మేరకు ఈ షెడ్యూల్ను క్యాన్సిల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట'ను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో కన్నడ సీనియర్ హీరో జయరాం మహేశ్ బాబు తండ్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతికి ఇది విడుదల కానుంది.