Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్లాన్ మార్చిన మహేశ్ బాబు: అవి కూడా అక్కడే డిజైన్ చేయాలని డిసైడ్
వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పటికే 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. హ్యాట్రిక్ను నమోదు చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలకు పెట్టింది పేరైన పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ.. షూటింగ్ మాత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇటీవలే రెగ్యూలర్ షూట్ మొదలైంది.
'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్ దుబాయ్లో జరుగుతోంది. అక్కడి ఎడారిలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అలాగే, వాళ్లు బస చేసిన హోటల్ గురించి కూడా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ఈ షెడ్యూల్లో కీలకమైన కొన్ని సన్నివేశాలతో పాటు రెండు పాటలు కూడా షూట్ చేయనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అనుకున్న దాని కంటే ఎక్కువ భాగం చిత్రీకరించాలని మహేశ్ డిసైడ్ అయినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
షూటింగ్కు అనువుగా ఉన్న దుబాయ్, షార్జాలో మరికొన్ని యాక్షన్ సీన్స్ను తీద్దామని దర్శకుడు పరశురాంకు సూచించాడట మహేశ్ బాబు. మరీ ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్ కూడా ఇక్కడే డిజైన్ చేయాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో దుబాయ్ షెడ్యూల్ పొడిగించబోతుందట 'సర్కారు వారి పాట' యూనిట్. ఇదిలా ఉండగా... ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు.