Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సర్కారు వారి పాట’పై కరోనా వైరస్ ప్రభావం: దెబ్బకు ప్లాన్ మార్చేసిన మహేశ్ టీమ్
సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు'తో గత ఏడాది ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ ఫలితం ఇచ్చిన జోష్లో ఉన్న అతడు.. ఆ వెంటనే ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన పరశురాం కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది గత ఏడాది ప్రారంభంలోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోవాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత డిసెంబర్లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుని, ఆ వెంటనే రెగ్యూలర్ షూట్ కూడా మొదలైంది.
దుబాయ్లో జరిగిన మొదటి షెడ్యూల్లో మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సీన్స్తో పాటు ఓ సాంగ్ను కూడా చిత్రీకరించారు. అలాగే, హీరో హీరోయిన్ల కాంబినేషన్ సీన్స్ కూడా షూట్ చేశారు. దాదాపు ఇరవై రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తర్వాత అక్కడ ప్యాకప్ చెప్పేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి మరో షెడ్యూల్ ప్రారంభించబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ముందుగా అనుకున్నట్లు దీన్ని అమెరికాలో కాకుండా దుబాయ్లోనే జరపనున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం కారణంగానే లొకేషన్ను చేంజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
మహేశ్ బాబు కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది 'సర్కారు వారి పాట'. బ్యాంకులను మోసం చేసి పారిపోతోన్న వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతికి ఇది విడుదల కానుంది.