Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాజీవ్ మీనన్ ‘సర్వం తాళమయం’
జి.వి.ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం సర్వం తాళమయం. ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్తో కలసి హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రాజీవ్ మీనన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సంగీతం, మెరిట్, గెలుపు ఓటముల గురించి ప్రస్తావించాం. గురుశిష్యుల సంబంధం గురించి ఉంటుంది. ఉమయాళ్పురం శివరామన్గారి మీద డాక్యుమెంటరీ చేస్తున్న సమయంలో వచ్చిన ఆలోచనతో ఈ చిత్రం చేశాం. మృదంగం తయారుచేసేవాళ్లకు వాయించడం చేతకాదు. ఒకవేళ వారేగనుక మృదంగం నేర్చుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్టుతో ఈ చిత్రం ఉంటుందన్నారు.
ఈ చిత్రంలో సుమేష్ నారాయణ్, బాంబే జయశ్రీతో పాటు చాలా మంది సంగీత విద్వాంసులు నటించారు. రెహమాన్గారి సంగీతం చాలా ప్లస్ అయింది. రెహమాన్ దిలీప్గా ఉన్నప్పటి నుంచీ నాకు చాలా ఇష్టం. నన్ను మెరుపుకలలు సినిమాకు దర్శకుడిని చేసింది కూడా రెహమానే. దాని తర్వాత ప్రియురాలు పిలిచింది సినిమా చేశామని గుర్తు చేసుకున్నారు.
దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నాను. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. 'సర్వం తాళమయం' చిత్రాన్ని తెలుగులో ఈ నెల 8న విడుదల చేస్తున్నాం. కె.విశ్వనాథ్గారు సినిమాను చూసి క్లైమాక్స్ లో కళ్లనీళ్లు పెట్టుకుని నా నుదుటిమీద ముద్దుపెట్టుకోవడం నేను ఎప్పటికీ మరిచిపోలేను అని రాజీవ్ మీనన్ తెలిపారు.
జి.వి.ప్రకాష్ మాట్లాడుతూ... మావయ్య రెహమాన్ గారు నా సినిమాకు సంగీతం అందించడం ఆనందించే విషయం. ఈ సినిమాలో ఒక బలమైన మెసేజ్ ఉంది. సినిమా కోసం మృదంగం వాయించడం నేర్చుకున్నా. సంగీత దర్శకుడిగానూ నాలో చాలా మార్పుతెచ్చిన సినిమా అన్నారు.