Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దర్శకుడు సతీష్ వేగేశ్న కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ.. శ్రీహరి తనయుడితో
శతమానం భవతి వంటి చిత్రాన్ని తెరకెక్కించి జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తాను చాటాడు సతీష్ వేగేశ్న. అయితే రెండో ప్రయత్నంగా చేసిన శ్రీనివాస కళ్యాణం మెప్పించలేకపోయింది. ఆ తర్వాత కల్యాణ్ రామ్తో తీసిన ఎంత మంచివాడవురా విమర్శకుల ప్రశంసలు అందుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకొలేకపోయింది.
తాజాగా తన కుమారుడు సమీర్ వేగేశ్నను హీరోగా పరిచయం చేస్తూ ఓ కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో శ్రీహరి కుమారుడు మేఘాంష్ కూడా మరో హీరోగా నటించబోతోన్నాడు. నేడు శ్రీహరి 56వ బర్త్ డే సందర్భంగా ఈ ప్రకటనను చేశారు. ఈ సినిమాను ఎంఎల్వీ సత్యనారాయణ లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది.
స్వర్గీయ శ్రీహరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు మేఘాంశ్. అయితే మొదటి చిత్రం సమయంలో సినీ పెద్దలంతా సహకారమందించారు. మొదటి చిత్రం రాజ్దూత్ను బాగానే ప్రమోట్ చేశారు. కథ, హీరో నటన, అప్పియరెన్స్ ఆకట్టుకొన్నప్పటికీ.. ఎన్నో కారణాలతో రాజ్ దూత్ మెప్పించలేకపోయింది. చాలా రోజులు తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం వేచి చూసిన మేఘాంశ్కు సతీష్ వేగేశ్న రూపంలో ఓ అవకాశం వచ్చింది.