Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
భారతీయ అన్ని భాషల్లో శ్రీమాన్ రామా.. యానిమేషన్ చిత్రంతో సత్య కాశి భార్గవ
యానిమేషన్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను మెప్పించడం కత్తిమీద సామే. ఇంకా యానిమేషన్ చిత్రాలను ఆదరించే అభిరుచి భారతీయ ప్రేక్షకులకు ఇంకా పూర్తిగా కలుగలేదు. అయినా యానిమేషన్ చిత్రాన్ని రూపొందించి అటు ప్రేక్షకులను ఇటు అవార్డుల గెలుచుకొన్న ఘనత సత్య కాశి భార్గవకు దక్కింది.
యానిమేషన్ చిత్రంగా రూపొందిన కిట్టూ అనే చిత్రానికి మొట్టమొదటిసారి జాతీయ అవార్డు గెలుచుకొన్న సత్యకాశి భార్గవ మరోసారి యానిమేషన్ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.
ప్రస్తుతం శ్రీ రామ చంద్రుడి బాల్యంలో ముఖ్య ఘట్టాను కథాంశంగా తీసుకొని శ్రీమాన్ రామా అనే చిత్రాన్ని తెరకోక్కించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషలతోపాటు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవేగంతో షూటింగు ముగించి 2021 ఏడాది చివరకు రిలీజ్ చేయాలనే సంకల్సంతో సత్యకాశి భార్గవ ఉన్నారు.
ఈ సందర్భంగా సత్యకాశి భార్గవ మాట్లాడుతూ.. ప్రస్తుత జనరేషన్కు పురాణాలపై అవగాహన కల్పించాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. శ్రీ రామ చంద్ర ప్రభువు బాల్యంలోని కీలక ఘట్టాలను యానిమేషన్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందించాలన్నే నా కోరిక అన్నారు. కిట్టూ చిత్రానికి లభించిన ఆదరణే ప్రేక్షకుల నుంచి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.