Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెద్ద హీరోలు కూడా చేయని డేర్ చేస్తున్న సత్యదేవ్.. థియేటర్స్ కి వచ్చేస్తున్నాడు!
కరోనా మహమ్మారి ప్రపంచం అంతటినీ ఎంతలా పట్టి కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మొదటి వేవ్ తర్వాత కాస్త పరిస్థితి కుదుట పడడంతో సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఊహించని విధంగా సెకండ్ వేవ్ వచ్చి పడటంతో అప్పటిదాకా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గింది. అయినా సరే థియేటర్ లో సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసం చేయడం లేదు. సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత కూడా తమ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో కుర్ర హీరో సత్యదేవ్ థియేటర్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటూ ప్రకటించాడు.
సత్యదేవ్ హీరోగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా బ్రహ్మాజీ, హేమ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా తిమ్మరుసు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి "తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి" అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రం 21 మే 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. కానీ జూలై 30వ తీదీన సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాకి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమా 2019లో వచ్చిన కన్నడ చిత్రం " బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని " రీమేక్ గా తెరకెక్కింది. మరో పక్క సత్య దేవ్ తెలుగులో "గాడ్సే", "గుర్తుందా శీతాకాలం" వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతానికి తెలంగాణలో థియేటర్ లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో సైతం 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లు ఓపెన్ చేసుకోవాలని సడలింపులు ఇచ్చారు.. అయినా పెద్ద సినిమాల నిర్మాతలు సహా ఎవరూ సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసించని క్రమంలో సత్యదేవ్ తన సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు గా ప్రకటించారు. మొత్తంమీద సత్యదేవ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు అని చెప్పక తప్పదు.