Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కాంట్రవర్షియల్ క్యారెక్టర్లో రాజేంద్రప్రసాద్.. శ్రీ రెడ్డి కూడా..
నటకిరీటి రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలతో ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సపోర్టింగ్ పాత్రలతోనే కాకుండా మెయిన్ లీడ్ లో కూడా మెప్పిస్తున్నారు. ఇక చాలా రోజుల తరువాత ఆయన ఒక వివాదస్పద పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యారు. ఆ పాత్ర బిజినెస్ మెన్ విజయ్ మాల్యా ఆధారంగా క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాలో మిగతా పాత్రలు కూడా ఇదే తరహాలో ఉంటాయని సమాచారం.
క్లైమాక్స్ అనే టైటిల్ సెట్ చేసిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ప్రసాద్ తో పాటు పృద్వి రాజ్, శివ శంకర మాస్టర్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ముఖ్యంగా శ్రీ రెడ్డి కూడా ఇందులో స్పెషల్ పాత్రలో కనిపిస్తుండడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన నిజ జీవితంలో ఉండే లక్షణాలను ఈ సినిమాలోని పాత్ర ద్వారా చూపించబోతున్నట్లు శ్రీ రెడ్డి గత ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.
ఇక ఈ క్లైమాక్స్ సినిమా షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ పూర్తయునట్లు సమాచారం. ఇక సినిమా థియేటర్లు ఓపెన్ అయితే సినిమాను భారీగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారట. భవాని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పి.రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మరి ఈ కాంట్రవర్సీ మూవీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.