మహేష్ బాబుని కలసిన రాజశేఖర్ దంపతులు.. ఎన్నికల వేడి మొదలైంది!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వేడి మొదలైంది. మా అధ్యక్ష పదవి కోసం మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. శివాజీ రాజాని మరోమారు అధ్యక్షుడిని చేసేందుకు కొందరు ఏకగ్రీవానికి ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. దీనితో సీనియర్ నటుడు నరేష్ పోటీలో నిలిచాడు.
తాజగా నరేష్, తన ఫ్యానల్ సభ్యులు అయిన హీరో రాజశేఖర్, జీవిత దంపతులని వెంటతీసుకుని సూపర్ స్టార్ మహేష్ ని కలిశారు. ఈ సందర్భమగా మా అసోసియేషన్ ఎన్నికల్లో తమకు మద్దత్తు తెలపాలని జీవిత, రాజశేఖర్ మహేష్ ని కోరారు. ఎన్నిక ఏకగ్రీవం కానందువల్లే పోటీకి దిగుతున్నానని నరేష్ స్పష్టం చేశారు.

మా అసోసియేషన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంతా నరేష్ నే గెలిపించాలని కోరారు. మార్చి 10న తాను ఎన్నికకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటానని మహేష్ తెలిపాడు. మహేష్ ని కలసిన ఫోటోలని నరేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా అసోసియేషన్ లో ప్రస్తుతం 800పైగా సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











