Don't Miss!
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- News సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబుని కలసిన రాజశేఖర్ దంపతులు.. ఎన్నికల వేడి మొదలైంది!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వేడి మొదలైంది. మా అధ్యక్ష పదవి కోసం మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. శివాజీ రాజాని మరోమారు అధ్యక్షుడిని చేసేందుకు కొందరు ఏకగ్రీవానికి ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. దీనితో సీనియర్ నటుడు నరేష్ పోటీలో నిలిచాడు.
తాజగా నరేష్, తన ఫ్యానల్ సభ్యులు అయిన హీరో రాజశేఖర్, జీవిత దంపతులని వెంటతీసుకుని సూపర్ స్టార్ మహేష్ ని కలిశారు. ఈ సందర్భమగా మా అసోసియేషన్ ఎన్నికల్లో తమకు మద్దత్తు తెలపాలని జీవిత, రాజశేఖర్ మహేష్ ని కోరారు. ఎన్నిక ఏకగ్రీవం కానందువల్లే పోటీకి దిగుతున్నానని నరేష్ స్పష్టం చేశారు.
మా అసోసియేషన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అంతా నరేష్ నే గెలిపించాలని కోరారు. మార్చి 10న తాను ఎన్నికకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటానని మహేష్ తెలిపాడు. మహేష్ ని కలసిన ఫోటోలని నరేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా అసోసియేషన్ లో ప్రస్తుతం 800పైగా సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే.