Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Sharwanand 30 షూటింగ్ పూర్తి.. యూనిట్తో కలిసి ఫుల్ ఖుషీ
శర్వానంద్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. వరుసబెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఒకటి పూర్తి కాక ముందే మరో ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వా ఖాతాలో 'గమ్యం' 'ప్రస్థానం' 'అందరి బంధువయా' 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి మంచి చిత్రాలెన్నో ఉన్నాయి.
అయితే మళ్లీ శర్వా తన స్థాయి హిట్ను కొట్టలేకపోతున్నాడు. రాధా, రణరంగం, పడి పడి లేచే మనసు వంటి చిత్రాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. అయితే ఈ సారి మాత్రం ఆడియెన్స్ను మెప్పించేందుకు గట్టిప్రయత్నమే చేస్తున్నాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే బి.కిశోర్రెడ్డి దర్శకత్వంలో 'శ్రీకారం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అజయ్ భూపతితో మహాసముద్రం అనే సినిమాను కూడా పట్టాలెక్కించాడు. అలాగే తిరుమల కిషోర్ దర్శకత్వంలో 'ఆడాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమా ప్రారంభించేశాడు. తాజాగా తన 30వ సినిమా షూటింగ్ పూర్తయిందని శర్వా సంతోషంగా ప్రకటించాడు. ఇందులో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోండగా.. అమల అక్కినేని తల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను ఎస్ ఆర్ ప్రభు తమిళ తెలుగు భాషల్లో నిర్మిస్తున్నాడు. శ్రీ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.