Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Sharwanand 30 షూటింగ్ పూర్తి.. యూనిట్తో కలిసి ఫుల్ ఖుషీ
శర్వానంద్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. వరుసబెట్టి చిత్రాలను చేస్తున్నాడు. ఒకటి పూర్తి కాక ముందే మరో ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ స్టార్ చేసి ప్రస్తుతం హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వా ఖాతాలో 'గమ్యం' 'ప్రస్థానం' 'అందరి బంధువయా' 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి మంచి చిత్రాలెన్నో ఉన్నాయి.
అయితే మళ్లీ శర్వా తన స్థాయి హిట్ను కొట్టలేకపోతున్నాడు. రాధా, రణరంగం, పడి పడి లేచే మనసు వంటి చిత్రాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. అయితే ఈ సారి మాత్రం ఆడియెన్స్ను మెప్పించేందుకు గట్టిప్రయత్నమే చేస్తున్నాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒకే చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే బి.కిశోర్రెడ్డి దర్శకత్వంలో 'శ్రీకారం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అజయ్ భూపతితో మహాసముద్రం అనే సినిమాను కూడా పట్టాలెక్కించాడు. అలాగే తిరుమల కిషోర్ దర్శకత్వంలో 'ఆడాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమా ప్రారంభించేశాడు. తాజాగా తన 30వ సినిమా షూటింగ్ పూర్తయిందని శర్వా సంతోషంగా ప్రకటించాడు. ఇందులో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోండగా.. అమల అక్కినేని తల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను ఎస్ ఆర్ ప్రభు తమిళ తెలుగు భాషల్లో నిర్మిస్తున్నాడు. శ్రీ కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.