Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రణరంగం ట్రైలర్: చికెన్ ముక్కతో చంపేశాడు.. సీఎంగా ఎన్టీఆర్ చేసిన పనిని గుర్తు చేశారు
టాలీవుడ్లోని యంగ్ హీరోలో శర్వానంద్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్వతహాగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్నో పరాజయాలను చూసినప్పటికీ తట్టుకుని నిలబడ్డాడు. యాక్టింగ్తో తనకు తానే అనుకునేంత రీతిలో శర్వా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తన అభిమానులు గర్వంగా చెప్పుకునేందుకు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన తాజా చిత్రం 'రణరంగం'. 1980 - 90 దశకాలకు సంబంధించిన కథతో రూపొందిందీ సినిమా.
ఆదివారం సాయంత్రం కాకినాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'రణరంగం' ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో శర్వాను సరికొత్త యాంగిల్లో చూపించారు. ముఖ్యంగా అతడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అలాగే ఈ సినిమాలో వైలెన్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్లేట్లో ఉన్న చికెన్ లెగ్ పీస్తో ఒక వ్యక్తిని పొడిచి చంపడం మరే సినిమాలోనూ చూసి ఉండరు.
అలాగే, ఈ ట్రైలర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును గుర్తు చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యనిషేధం విధించిన సంగతి తెలిసిందే. అప్పటి కథ నేపథ్యంలో ఈ సినిమాను విశాఖ పట్నం నేపథ్యంలో తెరకెక్కించారు. అక్కడ హీరో లిక్కర్ సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతుంది.
ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.