Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Republicకి షాక్.. ఆ సీన్స్ డిలీట్ చేయాలంటూ ఆందోళన.. కలెక్షన్స్ లో భారీ డ్రాప్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇక చాలా రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న సాయి మెల్లగా కోలుకుంటూ ఉండగా ఈ మధ్యనే సోషల్ మీడియా వేదికగా నేను బాగానే ఉన్నాను, అంతా ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. దీంతో అభిమానులు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఆ వివరాల్లోకి వెళితే
సక్సెస్ సెలబ్రేషన్స్ రద్దు
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1వ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా శని, ఆది వారాల్లో ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్నట్లు నిర్మాతలు కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
జీ సంస్థ ప్రకటన
నిజానికి ఇలాంటి గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత సక్సెస్ పార్టీ చేసుకోవాలి. కానీ సాయి తేజ ఇంకా కోలుకుంటున్నారు. ఆయన లేకుండా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం సరైనది కాదని మేం భావిస్తున్నామని సాయి తేజ్ గారు చాలా త్వరగా కోలుకోవడం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను అని రిపబ్లిక్ హక్కులు దక్కించుకున్న జీ సంస్థ ప్రకటన చేసింది.
నాలుగో రోజు భారీ డ్రాప్స్
ఇక ఇక రిపబ్లిక్ సినిమా 4 రోజుల్లో ఏపీ తెలంగాణలో 4.85 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుంది. మొదటి రెండు రోజుల్లో కాస్త బాగానే వసూళ్లు రాబట్టిన రిపబ్లిక్ మూడో రోజు ఏపీ తెలంగాణలో 1.85 కోట్ల షేర్ ను అందుకుంది, నాలుగో రోజు మరీ దారుణంగా కలెక్షన్లు పడిపోయాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రిపబ్లిక్ సినిమా 5.51 కోట్ల షేర్ ను అందుకుంది.
ఆగ్రహం
ఇక తాజాగా ఈ సినిమా ఈ సినిమా ఇప్పుడు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విషయంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద కొల్లేరు ప్రజలు ఆందోళనకు దిగారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాలో కొల్లేరును కాలుష్య కారకంగా, వ్యర్థాలతో చేపలు పెంచుతున్నట్లు చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Recommended Video
సుప్రీంకు వెళ్తాం
కొల్లేరులో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు... కొల్లేరు గురించి తప్పుగా చిత్రీకరిస్తే మేమంతా ఒక్కటేనని వారు పేర్కొన్నారు. కొల్లేరుపై చూపించిన సన్నివేశాలు తొలగించకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు కొల్లేరు పరిరక్షణ సమితి రంగంలోకి దిగి నిరసన వ్యక్తం చేసింది. ఇక సినిమాలో కొల్లేరు పేరును తెల్లెరుగా ప్రస్తావించారు.