Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పుష్ప హడావుడిలో షాకింగ్ ట్విస్ట్.. క్రికెటర్లకు డబ్బులిచ్చి ప్రమోషన్స్?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. మొదటిసారి చేసిన పాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇక ఓటీటీ లో కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో భారీగా ఖర్చు చేసినట్లుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది.
మూడవసారి..
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇది వరకే రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా ఆర్య ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వచ్చిన ఆర్య 2 మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక మూడవ సారి ఎలాగైనా మంచి సినిమాతో రావాలని అనుకున్నారు. ఇద్దరూ కూడా పుష్ప అనే పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకువచ్చారు. అల..వైకుంఠపురములో సినిమా అనంతరం బన్నీ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
నెగిటివ్ టాక్ వచ్చినా..
అసలు పుష్ప సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. ఎందుకంటే మొదట విడుదలైనపుడు ఈ సినిమాకు భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా నెగిటివ్ గానే రావడంతో సినిమా ఎక్కువ రోజులు థియేటర్లో ఉండకపోవచ్చు అని కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ పుష్ప మాత్రం ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకని అందరికీ షాక్ ఇచ్చింది.
హిందీలో భారీగా..
ఈ సినిమా కేవలం హిందీ మార్కెట్ లోనే వంద కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అందుకోవడం విశేషం. ఇటీవల కాలంలో వచ్చిన ఏ సినిమా కూడా ఆ స్థాయిలో వసూళ్లను అందుకోలేకపోయింది. దాదాపు రెండు వందల కోట్ల మార్కెట్ ఉన్న రణ్ వీర్ సింగ్ కూడా 83 సినిమాతో ఇటీవల ఆ స్థాయిలో కలెక్షన్స్ అయితే లేకపోయాడు. ఇక అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కడి స్టార్ హీరోల రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
స్టార్ క్రికెటర్స్ లో పుష్ప హడావుడి
ఇక ఇటీవల పుష్ప సినిమాను ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే సినిమాకు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కూడా స్టార్ క్రికెటర్స్ చాలావరకు పుష్ప సినిమా లోని అంశాలను హైలెట్ అయ్యేలా ఇమిటేట్ చేస్తున్నారు. శ్రీవల్లి స్టెప్పు తో పాటు తగ్గేదేలే అనే డైలాగ్ ను కూడా చాలామంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ గా మారుస్తున్నారు.
డబ్బులిచ్చి.. ప్రమోషన్?
డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, డీజే బ్రావో వంటి క్రికెటర్ లతో పాటు ఇతర సెలబ్రెటీలు కూడా పుష్ప సినిమాలోని శ్రీవల్లి స్టెప్పును అలాగే తగ్గేదేలే డైలాగ్ ను బాగా ఇమిటేట్ చేస్తున్నారు. ఇక అమెజాన్ ప్రైమ్ పుష్ప సినిమా వ్యూవర్షిప్ ను పెంచుకునేందుకు ఆ విధంగా డబ్బులిచ్చి ప్రమోషన్స్ చేయించినట్లుగా టాక్ అయితే వస్తుంది.
ట్రెండింగ్ లో పుష్ప?
ఇక ఆ వార్తలు ఎంతవరకు నిజం అనే విషయాన్ని పక్కన పెడితే నిజానికి పుష్ప సినిమా మాత్రం హిందీలో ఒక సరికొత్త సెన్సేషన్ ను క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఒక విధంగా పుష్ప స్టైల్ ను ఫాలో అయితే మిగతా సెలబ్రెటీలకు క్రేజ్ పెరుగుతుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ రీల్స్ ను ఫాలో అయితేనే సెలబ్రెటీలకు ఫాలోవర్స్ పెరుగుతారు. ఇక జనాల్లో పుష్ప ట్యాగ్స్ అయితే బాగానే వైరల్ అయ్యాయి. ఆ విధంగా ట్రెండ్ కు తగ్గట్టుగా చేసిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.