Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
దీపిక పదుకోన్తో పోటీ పడుతున్న శ్రద్దాకపూర్.. 5 కోట్లతో సాహో బ్యూటీ
బాలీవుడ్ అందాల తార శ్రద్దా కపూర్ సోషల్ మీడియాలో మరో ఘనతను సొంతం చేసుకొన్నారు. ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్ తర్వాత అత్యంత ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీగా రికార్డును సొంతం చేసుకొన్నది. తాజాగా తన అధికారిక ఇన్స్టా అకౌంట్లో శ్రద్దా కపూర్ 50 మిలియన్ల ఫాలోవర్స్ మైలురాయిని దాటేసింది.
ఇలా 501 మిలియన్ల ఫాలోవర్స్ను ఇన్స్టాగ్రామ్లో సొంతం చేసుకొన్న భారతీయ ప్రముఖుల్లో శ్రద్దాకపూర్ నాలుగో వారు. శ్రద్దా కపూర్ ఇన్స్టాలో 50 మిలియన్ల ఫాలోవర్స్ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా పలు రకాల పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ ఉత్సాహ పరిచారు.
శ్రద్దా కపూర్ ఈ ఘనతను సాధించడానికి ప్రధాన కారణం ఆమె నటించిన సినిమాలు, పోషించిన పాత్రలే అనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతున్నది. ఆ కారణంగానే దేశవ్యాప్తంగా విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నారు. సాహో చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. సాహో తర్వాత ఆమె నటించిన స్ట్రీట్ డ్యాన్సర్ 3 చిత్రం లాక్డౌన్కు ముందు రిలీజైన విషయం గమనార్హం.
కాగా, బాలీవుడ్లో 50 మిలియన్ల ఫాలోవర్స్ను దీపిక పదుకోన్ దాటేసిన ఘనతను ఇటీవల సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మానసిక రుగ్మత, శారీరక ఫిట్ నెస్ లాంటి అంశాలపై తన అభిమానులకు సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా తన సినిమాలు, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులు, నెటిజన్లతో పంచుకోవడం తెలిసిందే.