Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రక్తం ధార పోశాం.. అలా చేయడం సరికాదంటూ 'సాహో' భామ శ్రద్దా కపూర్ వార్నింగ్
పెరుగుతున్న టెక్నాలజీ విరుగుడుకే అన్నట్లుగా సాగుతోంది లోకం. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అనేక రంగాల్లో విధ్వంసం సృష్టించడం లాంటి పనులు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అందులో ఓ కీలకమైన సమస్య పైరసీ. ఈ మధ్యకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పైరసీ భూతం రాజ్యమేలుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సాహో భామ శ్రద్దా కపూర్ ఇదే విషయమై రియాక్ట్ అవుతూ పైరసీ దారులకు వార్నింగ్ ఇచ్చింది.
Saaho Twitter Review: Here's What Fans Feel About The Prabhas Starrer
డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి హై రేంజ్ రెస్పాన్స్
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా సాహో తెరకెక్కింది. దాదాపు 350 కోట్లు కేటాయించి హై రేంజ్ లో ఈ సినిమా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులందరికీ భారీ పారితోషికం ఇచ్చారు. ఈ మేరకు విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. నేడు ఓ రేంజ్ అంచనాల నడుమ విడుదలైన సాహో డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి హై రేంజ్ రెస్పాన్స్ రాబడుతోంది.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో
తెలుగుతో సహా మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కావడంతో దేశవ్యాప్తంగా సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో భారీ రేంజ్లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ సాహోలో ప్రభాస్ యాక్షన్, సుజీత్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని అంటున్నారు. తెలుగోడు గర్వించదగిన సినిమా సాహో అని కితాబిస్తున్నారు.
'సాహో' భామ వార్నింగ్
ఈ నేపథ్యంలో సాహో సినిమాను పైరసీ చేయొద్దంటూ సాహో భామ శ్రద్ద కపూర్ వార్నింగ్ ఇచ్చింది. ''వరల్డ్ సాహో డే వచ్చేసింది. చెమట, రక్తం ధారపోసి ఈ భారీ చిత్రాన్ని చిత్రీకరించాం. ఎన్నో అవాంతరాలను ఛేదిస్తూ మీ ముందుకు వచ్చాము. ‘సాహో' సినిమా డై హార్డ్ ఫ్యాన్స్ సొంతం. పైరసీ చేయొద్దు అని చెప్పింది శ్రద్ధ.
పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే
భారీ మూవీ సాహోను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి. పైరసీకి నో చెప్పండి. ఒకవేళ ఎవరైనా ఈ సినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే పైరసీ ఆర్గనైజేషన్కు సమాచారం అందించండి అని అంటూ పైరసీని అరికట్టేలా తన వంతు మెసేజ్ ఇచ్చింది శ్రద్ద కపూర్.
సాహో మూవీ
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. తెలుగులో శ్రద్ద కపూర్ కి ఇదే తొలి సినిమా కావడం విశేషం. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.