Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
శృతీ హాసన్ను ఇలా ఎప్పుడూ చూసుండరు.. లక్షల్లో లైకులొచ్చేస్తున్నాయ్.!
కమల్ హాసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసింది శృతీ హాసన్. తండ్రి పేరు చెప్పుకుని ఆమె ఎదగలేదు. సింగర్గా, యాక్టర్గా అనతి కాలంలోనే బడా ఇమేజ్ను సొంతం చేసుకుంది. తనకున్న మల్టిపుల్ టాలెంట్తో దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్లోకీ అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలో చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపిన శృతి.. ప్రేమలో పడిన తర్వాత మాత్రం తన కెరీర్కు తాత్కాలికంగా పుల్స్టాప్ పెట్టేసింది. ఇంగ్లండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడడంతో తన సినీ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది.
ఇటీవలే అతడికి బ్రేకప్ చెప్పేసి, మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఆమె పలు చిత్రాలు చేయడానికి సైతం సంతకాలు చేసేసింది. అలాగే, మరికొన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తమిళంలో విజయ్ సేతుపతి సరసన 'లాభం' అనే సినిమా చేస్తోంది. అలాగే, తెలుగులోనూ పలు చిత్రాలు చేయడానికి సిద్ధమైంది. ఇవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.
తమిళనాడు, శ్రీలంకలలో ఎక్కువగా వాయించే 'పరాయ్'ను వాయిస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. స్వతహాగా సంగీత దర్శకురాలైన శ్రుతి.. ఈ వీడియోలో డప్పు వాయిస్తూ దానికి అనుగుణంగా కాలు కదుపుతూ కనిపించింది. దీన్ని పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే లక్షల్లో లైకులు వచ్చేశాయి. దీన్ని కమల్ ఫ్యాన్స్ తమ పేజీల్లో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శృతీ హాసన్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటిలో చాలా వరకు హిట్లే ఉన్నాయి. అయితే, 2017లో వచ్చిన 'కాటమరాయుడు' తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.