Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సైమా 2019... అత్యధిక నామినేషన్లు ‘రంగస్థలం’ చిత్రానికే!
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2019 వేడుక ఈ సారి ఖతార్లో వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 15, 16 తేదీల్లో ఈ ప్రోగ్రాం జరుగనుంది. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను నిర్వాహకులు ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించారు.
సైమా ప్రెస్ మీట్లో విబ్రి మీడియా ఎండీ విష్ణు ఇందూరి, స్పాన్సర్ షిప్ సంస్థ పాంటలూన్స్ మార్కెటింగ్, ఈకామర్స్ హెడ్ మిస్టర్ ర్యాన్ ఫెర్నాండెజ్, శ్రియా శరన్, శాన్వి శ్రీవాస్తవ, అస్మిత నర్వాల్, నిధి అగర్వాల్, మాన్వితా కామత్, రుహాని శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సుధీర్బాబు తదితరులు సందడి చేశారు.
గతేడాది విడుదలైన సినిమాలకు సంబంధించి ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రధానం చేయబోతున్నారు. ఈ సైమా అవార్డుల్లో రంగస్థలం చిత్రం అత్యధికంగా 12 కేటగిరీల్లో నామినేట్ అయింది. మహానటి చిత్రాని 9 నామినేషన్స్, గీత గోవిందం మూవీకి 8 నామినేషన్స్, అరవింద సమేతకు 6 నామినేషన్స్ వచ్చాయి. ఎవరికి ఏ అవార్డు దక్కుతుంది, ఏ మూవీ ఎన్ని అవార్డులు దక్కించుకుంటుంది అనేది ఆగస్టు 15, 16 తేదీల్లో తేలనుంది.
కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మాత్రమే కాదు... కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలకు కూడా అవార్డుల ప్రధానం జరుగబోతోంది. ఖతార్లో రెండు రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వేడుకలో సౌతిండియా స్టార్లు అందరూ సందడి చేయబోతున్నారు.