Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘సర్కారు వారి పాట’ నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్: సినిమాలో భాగమైన సితార.!
హ్యాండ్సమ్ లుక్స్తో పాటు అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు మహేశ్ బాబు. 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయమై... ఎంతో మంది అమ్మాయిల గుండెల్లో నిజమైన రాకుమారుడిగా మారిపోయాడు. హిట్తో పొంగిపోకుండా... ఫ్లాఫ్ వచ్చినప్పుడు క్రుంగిపోకుండా ముందడుగు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే మరిన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైనర్స్తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో బ్యాంకులను మోసం చేస్తున్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా... అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ మధ్య మొదలెట్టాలనుకున్నా కరోనా వైరస్ ప్రభావంతో రద్దయింది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ఉంటుందా అని అంతా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం 'సర్కారు వారి పాట'కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మైత్రీ మూవీ మేకర్స సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహేశ్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితార హాజరయ్యారు.
Eagerly waiting and excited to be on the sets! 👍😊😊 #SarkaruVaariPaata https://t.co/vJSg4Ok5MY
— Parasuram Petla (@ParasuramPetla) November 21, 2020
ఈ కార్యక్రమం అనంతరం నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సితార దేవుడి చిత్ర పటాలపై క్లాప్ కొట్టింది. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలాఉండగా, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని దర్శకుడు పరశురాం ట్వీట్ చేశాడు.