Just In
- 17 min ago
రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్.. కామెడీ హీరోకు నాని సలహా
- 1 hr ago
రష్మిక బ్రేకప్ పై ఇంకా తగ్గని ప్రశ్నలు.. విజయ్ దేవరకొండ ఇచ్చిన జవాబుకు రిపోర్టర్ మైండ్ బ్లాక్
- 1 hr ago
2021 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ .. ఇండియాలో కూడా లైవ్.. ఎప్పుడంటే?
- 1 hr ago
అరణ్య ట్రైలర్ ఎప్పుడంటే.. రచ్చ చేసేందుకు రానా రెడీ!
Don't Miss!
- News
టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ పథకాలు..: ఎమ్మెల్యే రాజయ్య సంచలనం
- Sports
కొంచెం స్పిన్ అయితే చాలు ఏడుపు మొదలుపెడతారు.. మొతేరా పిచ్ విమర్శకులపై నాథన్ లయన్ ఫైర్!
- Finance
9 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.2 లక్షల కోట్లు డౌన్, రిలయన్స్ మాత్రమే అదరగొట్టింది
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్కు శివాజీ రాజా కౌంటర్.. ఇలాగే మాట్లాడతానంటూ రచ్చ రచ్చ
సీనియర్ జర్నలిస్ట్, పీఆర్ఓ పసుపులేటి రామారావు ఇటీవలె మృతి చెందిన సంగతి తెలిసిందే. యూరిన్ ఇన్ఫెక్షన్కి గురైన ఆయన ఫిబ్రవరి 11న వనస్థలిపురంలోని ప్రైవేట్ హాస్పిటల్లో మరణించారు. ఈయన మృతిపై సినీ పెద్దలందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ పెద్దలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..
పసుపులేటి రామారావు మృతి పట్ల సినీ ప్రముఖులందరూ సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వయంగా చిరంజీవి పసుపులేటి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళ్లు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. పవన్ కళ్యాణ్, మోహన్ బాబు దగ్గరి నుంచి యంగ్ హీరోల వరకు సోషల్ మీడియాలో స్పందించారు.

చిరంజీవికి ధన్యవాదాలు..
సినీ ప్రముఖులు ఏర్పాటు చేసిన సంతాప సభలో శివాజీ రాజా మాట్లాడుతూ.. అందరిపై ఫైర్ అయ్యాడు. మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఆయన సినీ పరిశ్రమకు సేవ చేస్తూనే ఉన్నాడని, ఆయన రాసిన రాతల వల్లే తామంతా ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేసుకున్నాడు. ఆ మధ్య ఆయన మోకాళుకు చికిత్స చేయిస్తానంటే.. చిరంజీవి గారు చేయిస్తారని అన్నట్లు ఆయన తెలిపాడని.. శివాజీ రాజ గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి ధన్యవాదాలు అంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్కు కౌంటర్..
పసుపులేటి రామారావు గారు పోతే.. ఎంతో మంది స్పందించారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని కొందరు (పవన్ కళ్యాణ్), మా కుటుంబంలోని వ్యక్తి అని మరికొందరు సంతాపాన్ని వ్యక్తం చేశారు.. మరి వారంతా ఎక్కడికి పోయారు.. ఇక్కడ లేరే? అంటూ ఫైర్ అయ్యాడు. ఎవరైనా చనిపోతే.. ఈ పదాలు వాడాలని వాడేస్తుంటారంటూ చురకలంటించాడు.

మీడియాపైనా ఫైర్..
తనకు ఇలాగే మాట్లడటం వచ్చు.. ఇలాగే మాట్లాడతానంటూ.. మీడియాపైనా ఫైర్ అయ్యాడు. తనకు అబద్దాలు చెప్పే అలవాటు లేదని అంటూ.. నటీనటుల మధ్య బేధాభిప్రాయాలున్నాయి ఓకే.. మీడియాలోనూ ఉన్నాయి.. అలాంటి వ్యక్తిని ఇలానా పంపించేదంటూ ఫైర్ అయ్యాడు. ఎవరైనా చనిపోతే.. ఎంతో కొంత కలెక్ట్ చేసి ఇవ్వడం తనకు అలవాటని, అదే విధంగా ఆయన కుటుంబానికి కూడా ఓ ఐదు లక్షలు అందిస్తానని, అదే తాను చేయగలిగిన సహాయమని పేర్కొన్నాడు.