Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'మా' ఇష్యూపై శివాజీరాజా సెన్సేషన్.. పెద్దలను పిలిచి అవమానించారంటూ ఫైర్
'మా' 2020 డైరీ ఆవిష్కరణలో జరిగిన పరిణామాలు సినీ వర్గాల్లో హాట్ హాట్ చర్చలకు దారితీశాయి. వేదికపై చిరంజీవి ఇచ్చిన సలహాపై రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఇష్యూపై 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి పోతే..
భగ్గుమన్న విభేదాలు.. రాజశేఖర్, చిరంజీవి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 'మా' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్, చిరంజీవి మధ్య రాజుకున్న వివాదం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. రాజశేఖర్ ప్రవర్తించిన తీరుపట్ల మోహన్బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితరులు వెంటనే తమ అసంతృప్తిని తెలియజేశారు.
శివాజీరాజా సెన్సేషన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గత కొన్నేళ్లుగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోయింది. 'మా' సభ్యుల్లో ఒకరికొకరంటే ఏ మాత్రం పడటం లేదు. గతంలో శివాజీరాజా- నరేష్ మధ్య వివాదం రాజుకొని సంచలనం కాగా ఇప్పుడు రాజశేఖర్- నరేష్ ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో మా డైరీ ఆవిష్కరణ సభలో జరిగిన పరిణామాలపై స్పందిస్తూ శివాజీరాజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
పెద్దలను పిలిచి అవమానించారు
నిన్న జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరమని చెప్పిన శివాజీ రాజా.. చిరంజీవి సహా పెద్దలందరూ వేదికపై ఉండగా ఇలా జరగడం బాధగా అనిపించిందని పేర్కొన్నారు. పెద్దలను పిలిచి సభను రసాభాస చేయడమే కాకుండా అవమాన పరిచారని అన్నారు. ఎన్నికలు జరిగి ఇంతకాలం అవుతున్నప్పటికీ రూపాయి లెక్క తెలియని అధ్యక్షుడు దీనిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.
ఇలాంటి అధ్యక్షుడు ఉండటం దురదృష్టకరం
తాను వ్యక్తిగతంగా ఎవరినీ దూషించడం లేదు, కానీ ఆత్మ విమర్శ చేసుకోవాలని శివాజీ రాజా అన్నారు. రాజశేఖర్గారు చాలా ఎమోషనల్ పర్సన్ అని, `మా`కు10 లక్షలు విరాళం ఇచ్చినా కూడా ఆయన బయటకు చెప్పుకోలేదని గుర్తుచేశారు శివాజీరాజా. ఈ సందర్బంగా అసోసియేషన్కు నరేష్గారు ఎంత ఫండ్ తెచ్చారో చెప్పాలని అడిగారు.
వడ్డించిన విస్తరని కాలితో తన్నారు
దాతలు విరాళాలు ఇస్తామని ముందుకు వస్తే వడ్డించిన విస్తరని కాలితో తన్నారని, ఇలాంటి అధ్యక్షుడు ఉండటం చాలా దురదృష్టకరమని శివాజీరాజా ఆరోపించారు. దీంతో శివాజీ రాజా మాట్లాడిన తీరు సినీ వర్గాల్లో మరిన్ని చర్చలకు తావిస్తోంది.