Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Allu Arjun పై కేసు నమోదు.. యాడ్తో తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు
పుష్ప మూవీ భారీ సక్సెస్తో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ అలియాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు బ్రాండ్ వ్యాల్యూ దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఇటీవల పలు వ్యాపార ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అనేక బ్రాండ్లకు ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఇటీవల శ్రీ చైతన్య విదయా సంస్థల కోసం ఓ వ్యాపార ప్రకటనలో నటించారు.
అయితే చైతన్య విద్యా సంస్థల వ్యాపార ప్రకటనల్లో చేసిన ప్రమోషన్ తప్పుదోవ పట్టించేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
IIT, NIT ర్యాంకుల గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. పలు వార్త పత్రికల్లో జూన్ 6వ తేదీన వచ్చిన ప్రకటనల్లో పూర్తిగా వాస్తవం లేదు. ఈ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలి అని అంబర్పేట పోలీస్ స్టేషన్లో సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి కేసు నమోదు చేశారు.
IIT, NIT ర్యాంకుల విషయంలో తప్పు దోవ పట్టించిన శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కూడా కొత్త ఉపేందర్ రెడ్డి కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.