ఇలాంటి వారిని చూస్తే కరోనా కూడా.. మీకసలు బుద్ది ఉందా.. ప్రజలపై విలన్ ఫైర్
కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూను విధించిన సంగతి తెలిసిందే. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు అందరూ బయటకు వచ్చి ఇలాంటి విపత్కర కాలంలో మన కోసం సేవలందిస్తున్న వైద్యులకు, నర్సులకు, వైద్య సిబ్బంధికి, పోలీసులను గుర్తు చేసుకునేందుకు, వారిని గౌరవించేందుకు బాల్కనీలోకి వచ్చి కరతాళ ధ్వనులు, గంటలు కొట్టాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.

జనతా కర్ఫ్యూ సక్సెస్..
ప్రధాని తలపెట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కదిలి వచ్చి జనతా కర్ఫ్యూ పట్ల అవగాహన కల్గించడం కూడా అందుకు ఓ ముఖ్య కారణం.సాయంత్రం ఐదు గంటలకు అందరూ బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టి వైద్య బృందాన్ని గౌరవించారు.

కొందరు శృతిమించి..
అయితే ఈ క్రమంలో కొందరు శృతి మించిపోయారు. రోడ్లపైకి జాతరలా వచ్చి, డ్యాన్సులు చేసుకుంటూ సందడి చేశారు. గంటలు కొడుతూ, ప్లేట్లతో శబ్దాలు చేస్తూ జనసందోహంగా మారారు. ఈ వీడియోపై ప్రముఖ నటుడు, విలన్ సోనూసూద్ ఫైర్ అయ్యారు.
కరోనాపై సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్..
కరోనాపై సోనూసూద్ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. చిన్నప్పుడే అమ్మ చెప్పింది.. కానీ వినలేదు.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పరిశుభ్రంగా ఉండాలని అయినా వినలేదు.. ప్రస్తుతం అందరూ అదే పాటిస్తున్నారు.. అంతా సక్రమంగా జరుగుతుందని, అంతా సర్దుకుంటుందని అమ్మ అప్పుడే చెప్పిందని తెలిపాడు.
Recommended Video

బుద్ది ఉందా అంటూ ఫైర్..
తాజాగా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి డ్యాన్సులు చేస్తున్న వీడియోపై నిప్పులు చెరిగాడు. ‘అసలు వీరికి మెదడు ఉండాల్సిన ప్లేస్లోనే ఉందా.. కరోనా కూడా ఆలోచనలో పడుతుంది.. వీరి తెలివి ముందు ఓడిపోయి దేశం నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుంది.. 'అంటూ తన అసహనాన్ని ప్రదర్శించాడు.


Click it and Unblock the Notifications











