Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సంజీవని’పై అవగాహన... వ్యాక్సిన్ వేయించుకున్న సోనూ సూద్
ప్రస్తుతం దేశంలో కరోనా ఎంతలా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు కరోనా వ్యాక్సిన్ను అందరికీ ఇచ్చే ప్రోగ్రాంను ప్రభుత్వాలు చేపడుతుంటే.. మరో వైపు కరోనా తాండవం చేస్తోంది. అలా కరోనా వ్యాక్సిన్ను అందరూ వేసుకోవాలి.. దానిపై వస్తోన్న చెడు ప్రచారాలను పారద్రోలేలా కార్యక్రమాలు చేపడుతోంది ప్రభుత్వం. ఈ క్రమంలో నేడు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సంజీవని అంటూ పేరు పెట్టి చేపడుతున్న ఈ కార్యక్రమంలో సోనూ సూద్ భాగస్వామి అయ్యాడు.
సోనూ సూద్ ఇప్పుడు దేశ ప్రజలందరికీ ఓ సూపర్ హీరో. ఆయన్ను ఫాలో అయ్యేవారు కొన్ని కోట్లల్లో ఉన్నారు. సోనూ సూద్ చెబితే వినే వాళ్లు, చెప్పిన దాన్ని ఆచరించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే వ్యాక్సిన్పై ఉన్న అనుమానాలన్నీంటిని నివృత్తి చేసేందుకు సోనూ సూద్ను రంగంలోకి దించింది ప్రభుత్వం. తాజాగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
తాజాగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. నేను ఈ రోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఇక ఇప్పుడు నా దేశమొత్తం వేయించుకోవాల్సిన సమయం వచ్చింది. సంజీవిని అంటూ అతి పెద్ద కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు వ్యాక్సిన్ మీద అవగాహన కల్పిస్తున్నామని, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సోనూ సూద్ అన్నాడు. లాక్డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు సోనూ సూద్ చేసిన, ఇంకా చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే.