Don't Miss!
- News ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా సెకండ్ వేవ్: సోనూసూద్పై మరింత ఒత్తిడి.. ఒకేరోజు వేల ఫోన్ కాల్స్.. షాకింగ్ నిర్ణయం!
మరోసారి కరోనా విజృంభిస్తోంది. దేశం నలువైపులా రోజుకు వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. లక్షల మంది కోవిడ్ భారిన పడాల్సి వస్తోంది. కరోనా తగ్గిందని సంతోషంగా ఉన్న సమయంలో మరోసారి షాక్ ఇవ్వడం ఇప్పుడు ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది. అయితే కరోనా మొదటి వేవ్ లో ఎంతోమందికి సహాయం చేసిన సోనూసూద్ ఇప్పుడు ఎటు తేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇటీవల ఆయన సోషల్ మీడియా ద్వారా చాలా ఎమోషనల్ గా స్పందించారు.
సొంత ఖర్చులతో..
దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలైనప్పుడు ఎంతో మంది సినీ తారలు సహాయలు చేశారు. అయితే వలసదారుల కష్టాలను చాలా దగ్గరగా చూసిన సోనూసూద్ మరో అడుగు ముందుకు వేశాడు. రోడ్డుపై వేల కిలోమీటర్లు నడవడానికి సిద్దమైన వారిని సొంత ఖర్చులతో వారి గ్రామాలకు చేర్చాడు.
కరోనా తరువాత కూడా
కేవలం ప్రయాణానికి సంబంధించిన విషయంలోనే కాకుండా ఎంతో మంది ఆకలి బాధలను తీర్చాడు. ఆర్థికంగా కూడా చాలా మందికి సహాయాన్ని అందించాడు. అలాగే రైతులకు పేద విద్యార్థులకు కూడా ఎంతగానో సహాయలు చేశాడు. కరోనా తరువాత కూడా తన సహాయలు కొనసాగుతాయని చెబుతూ వస్తున్నాడు.
పరిస్థితి భయానకంగా ఉంది
అయితే కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఇప్పుడు ఆయనకు వస్తున్న ఫోన్ కాల్స్ వేలల్లో ఉన్నాయట. హాస్పిటల్ బెడ్లు, మెడిసిన్లు, ఇంజెక్షన్ల కోసం భారతదేశం నలుమూలల నుండి వేల సంఖ్యలో కాల్లు వచ్చాయని, ఇప్పటికీ చాలా మందికి అందించలేకపోయాను, ఇది నేను చాలా నిస్సహాయంగా భావిస్తున్నాను. పరిస్థితి భయానకంగా ఉంది.. అంటూ సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు.
Recommended Video
నా ఒక్కడితోనే సాధ్యం కాదు.
ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ఇంట్లో ఉండండి, ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవాలి. నేను తప్పకుండా వీలైనంత మందికి సహాయం చేస్తాను. కానీ అది నా ఒక్కడితోనే సాధ్యం కాదు. మనం కలిసి మరెన్నో ప్రాణాలను రక్షించగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది ఎవరినీ నిందించడానికి కాదు, మీ సహాయం అవసరమైన పేదవారి కోసం ముందుకు రండి. పేద వారికి వైద్య అవసరాలను అందించడానికి ప్రయత్నించండి.. అంటూ సోనూసూద్ వివరణ ఇచ్చాడు.