Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
త్వరలో మంచి వార్త.. ఎస్పీ బాలు ఆరోగ్యంపై కుమారుడి ప్రకటన
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడటం అభిమానులకు, సన్నిహితులు, స్నేహితులకు ఊరట కలిగిస్తున్నది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమం నుంచి సాధారణ స్థాయికి వచ్చినట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సానుకూలమైన వార్తను మీడియాకు వెల్లడించారు.
ఎస్పీ చరణ్ లేటేస్ట్ వీడియోలో మాట్లాడుతూ.. నాన్నగారి ఆరోగ్యం వరుసగా నాలుగో రోజు కూడా నిలకడగా ఉంది. ఈ వారాంతానికి మంచి వార్త వైద్యులు చెప్పే అవకాశం ఉంది. దేవుడి దీవెనలు, మీ అందరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ప్రార్థన వల్ల ఆయన త్వరగా కోలుకొన్నారు. సోమవారం నాటికి మీకు మంచి శుభవార్త వింటారు. ఆ రోజు కోసం వేచి చూస్తున్నాం అని అన్నారు. గత కొద్ది రోజులుగా ఫిజియోథెరపీ చికిత్సను అందిస్తున్నట్టు సమాచారం.
కరోనావైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారడంతో ఆందోళన వ్యక్తమైంది. ఆగస్టు 13వ తేదీ రాత్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మరింత విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమించడంతో రజనీకాంత్, చిరంజీవి, ఏఆర్ రెహ్మాన్, కమల్ హాసన్తో సహా పలువురు సినీ హీరోలు, ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.