Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నేరుగా ఓటీటీలో ‘రాజ రాజ చోర’ రిలీజ్: ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసా?
విలక్షణ నటనతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. సహజ సిద్ధమైన నటనతో ఎన్నో సినిమాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడతను. ఈ క్రమంలోనే జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది 'గాలి సంపత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ప్రస్తుతం 'రాజ రాజ చోర' అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్లో వైరల్ అవుతోంది.
నూతన దర్శకుడు హసిత్ గోలి డైరెక్షన్లో శ్రీ విష్ణు నటిస్తోన్న చిత్రమే 'రాజ రాజ చోర'. ఢిఫరెంట్ కాన్సెప్టుతో కామెడీ, ఎమోషన్స్ మేళవింపుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ డేరింగ్ స్టెప్ తీసుకుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారట. ఇందుకోసం ZEE సంస్థ ఊహించని ధరకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ మూవీ Zee5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లోనే రానుందనే టాక్ బాగా వినిపిస్తోంది.
పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న 'రాజ రాజ చోర' టీజర్ శుక్రవారమే విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటిస్తోంది. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శ్రీ విష్ణు దొంగగా నటిస్తోన్న విషయం తెలిసిందే.