ఎర్రి *** మాష్టర్ జాలి వేస్తుందిరా.. అడవి పంది అంటూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
శ్రీరెడ్డి.. తెలుగు నాట ప్రకంపనలు సృష్టించి చెన్నై వెళ్లి సెటిలైంది. సర్లే కోలీవుడ్లో వెళ్లి అక్కడే ఉంది కదా అనుకుంటే పొరబాటే.. సందు దొరికితే చాలు టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేస్తూనే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్పై అయితే సమయం సందర్భం లేకపోయినా సరే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.. ఆయన ఫ్యాన్స్తో వాగ్వాదానికి దిగుతూనే ఉంటుంది. ఆమెను ఏమి అనకపోతేనే ఈ రేంజ్లో శివాలెత్తుతుంటే.. ఏమైనా అంటే ఇంక ఆగుతుందా.. బూతు పురాణం మొదలెట్టదూ. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.

నేను పిలవలేదు..
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్.. శ్రీరెడ్డి గురించి, ఆమె క్యారెక్టర్ గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. తనను బాబాయ్ అని పిలివమని శ్రీ రెడ్డితో చెప్పానని, ఆ బిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఏమైందమ్మా అని ఫోన్ చేశానని తెలిపాడు. మా అన్నయ్య, వదిన, వాళ్ల కూతురు ఆమెను భోజనానికి పిలిచారు. నేను ఆమెను పిలవలేదని రాకేష్ మాస్టర్ స్పష్టం చేశాడు. ఇప్పుడు తన పైనే నింద వేస్తోంది ఈ విషయంలో ఆమెను వదిలే ప్రసక్తే లేదని ఫైర్ అయ్యాడు.

ఎంత వరకు ఉండాలో అంతవరకే..
నిజంగా ఆమె నుంచి తాను ఏమైనా ఆశించి ఉంటే.. బాబాయ్ అని పిలువమని ఎందుకు చెప్తానన్నాడు. ఒకవేళ తాను ఆమెతో వల్గర్గా మాట్లాడి ఉంటే ఆ ఆడియో లీక్ చేయొచ్చు కదా.. రాకేష్ మాస్టర్ ఎవరితో ఎంత వరకూ ఉండాలో అంతవరకే ఉంటాడని చెప్పుకొచ్చాడు.
Recommended Video

బూతుపురాణంతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి
రాకేష్ మాస్టర్ చేసిన కామెంట్స్పై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘వెర్రి *** మాష్టర్ నీ మీద జాలి వేస్తోంది రా అడవి పంది' అంటూ ఓ పోస్ట్ చేసింది. మరో పోస్ట్లో ‘నా బూతుల పంచాంగం విప్పితే నీ పూర్వీకులు దిగొచ్చి సారీ చెప్తార్రా పబ్లిసిటీ క్రేజ్ కుక్క' అంటూ అడ్డూఅదుపూ లేకుండా మాటలను వదిలింది.

ఆ వీడియోలు చేసుకుంటూ..
ఒకప్పడు హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన శ్రీ రెడ్డి.. ప్రస్తుతం కాస్త పద్దతైన దుస్తులనే ధరిస్తోంది. అంతేకాకుండా వంటల ప్రోగ్రామ్ లాంటివి చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తోంది. అయితే సమయం వచ్చినప్పుడు తనలోని పాత శ్రీ రెడ్డిని మాత్రం ఇలా బయటకు తెస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications











