Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మంచు లక్ష్మిపై శ్రీ రెడ్డి అటాక్.. ఇంగ్లీ పుత్రీ అంటూ
పబ్లిక్గా మాట్లాడేటపుడు ముందూ వెనుక ఆలోచించి మాట్లాడాలని అంటుంటారు పెద్దలు. సమయం, సందర్భం లేకుండా నోటికేదొస్తే అది అనేయడం ద్వారా లేనిపోని చిక్కులొస్తాయే తప్ప ఒరిగేదేమీ ఉండదని చెబుతుంటారు. అది అక్షరాలా నిజమని రుజువు చేశాయి మంచు లక్ష్మి మాటలు. ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండైన మంచు వారి బిడ్డ.. ట్రోలింగ్ పాలవడమే గాక శ్రీ రెడ్డి చేత కూడా మాట పడింది. ఇంతకీ ఏం జరిగింది? అసలు సంగతులు ఏంటి? వివరాల్లోకి పోతే..
ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్
అక్కినేని సమంత లీడ్ రోల్లో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది ఓ బేబీ సినిమా. జులై 5 వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్బంగా హైదరాబాద్ లో ఘనంగా ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు వెంకటేష్, రానా, రాఘవేంద్ర రావు, మంచు లక్ష్మి తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
స్టేజ్పై నోరుజారిన మంచు లక్ష్మి
వేదికపై మంచు లక్ష్మి ఇచ్చిన స్పీచ్ ట్రోలింగ్ కి కారణమైంది. 'ఓ బేబీ' చిత్రంలో నటించిన సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ను పొగడ్తల వర్షంలో ముంచెత్తే ప్రయత్నంలో భాగంగా ''మీరు నటించిన జంబలకిడిపంబ చిత్రం 1000 సార్లు చూసి.. ఆ క్యాసెట్ అరగ్గొట్టేశాం'' అంటూ కాస్త ఎక్కువ చేసి మాట్లాడేసింది మంచు లక్ష్మి. ఇదే పాయింట్ ఆమెను ఇరుకున పడేసింది.
నెటిజన్స్ ట్రోలింగ్
మంచు లక్ష్మి స్పీచ్ విన్న ఆడియన్స్ ముక్కున వేలేసుకున్నారు. అరె! 'జంబలకిడిపంబ' చిత్రంలో హీరో నరేష్ కదా.. రాజేంద్ర ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడు? అంటూ ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగక అమ్మా మంచులక్ష్మీ కాస్త తెలుసుకుని స్పీచ్లు ఇవ్వవమ్మా అంటూ ఆమెపై ట్రోల్స్ మొదలు పెట్టారు.
రంగంలోకి శ్రీ రెడ్డి
ఇది గమనించిన టాలీవడ్ సంచలనం శ్రీ రెడ్డి వెంటనే రంగం లోకి దిగింది. మంచులక్ష్మిపై సెటైర్లు వేస్తూ పంచులు విసిరింది. తన ఫేస్బుక్ ద్వారా పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి.. మంచు లక్ష్మి పై ఇంగ్లీ పుత్రీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మంచులక్ష్మి జీ.. జంబలకిడిపంబ హీరో రాజేంద్రప్రసాద్ గారు కాదమ్మా... పొగడకపోయినా ఫర్వాలేదు గానీ అవమానించకమ్మా అంటూ చురకలంటించింది శ్రీరెడ్డి.