Don't Miss!
- Sports రోహిత్ స్టార్ట్ చేశాడు.. ‘RIP హార్దిక్’ అంటూ పోస్ట్లు Video
- Finance Gold Loan: గోల్డ్లోన్స్ తీసుకున్నోళ్లకి హెచ్చరిక..! ఇవి తప్పక తెలుసుకోండి..
- News నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
దిశా హత్యకేసుపై శ్రీ రెడ్డి రియాక్షన్.. రేపిస్టుల కారణంగా తల్లిదండ్రుల్లో ఆలోచనలంటూ పోస్ట్
హైదరాబాద్లో జరిగిన దిశా హత్య ఘటన యావత్ భారత దేశాన్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా జనం ఈ హత్యను ఖండిస్తున్నారు. మానవ మృగాల రాక్షసత్వానికి బలైన వెటర్నరీ డాక్టర్ తరుపున యావత్ లోకం నిరసరస జ్వాలలు రగుల్చుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తాజాగా ఈ దుర్ఘటనపై శ్రీ రెడ్డి స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
శ్రీ రెడ్డి రూటే సపరేటు.. కానీ!
సాధారణంగా శ్రీ రెడ్డి రూటే సపరేటు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియా ఖాతాలు తెరిస్తే చాలు అంతా ఎలాంటి సందేశాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంగతెలా ఉన్నా ఆమెకు ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. కాగా ఇటీవల జరిగిన దిశా ఘటనపై శ్రీ రెడ్డి స్పందించిన తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
ఒక్కప్పుడు పేరెంట్స్ అంటూ సందేశం
''ఒక్కప్పుడు పేరెంట్స్ కడుపులోనే బిడ్డను చంపేసేవారు. కడుపులో పెడుతోంది ఆడపిల్ల అని తెలిస్తే ఇలా చేసేవారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులనే తీసుకొస్తున్నారు రేపిస్టులు. వాళ్ళు చేసే పనులు చూసి పేరెంట్స్ మళ్ళీ ఆ ఆలోచనలో పడే పరిస్థితులు కల్పిస్తున్నారు'' అంటూ కాస్త పవర్ఫుల్ సందేశమే పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
నెటిజన్ల స్పందన.. భవిష్యత్లో ఆడవాళ్లు
శ్రీ రెడ్డి చేసిన ఈ పోస్ట్పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. శ్రీ రెడ్డి చెప్పిన దాంట్లో ఆలోచించాల్సిన విషయం ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్లో ఆడవాళ్లను మ్యూజియంలో చూడాల్సిన దుస్థితి వస్తుందని అంటున్నారు నెటిజన్లు.
శ్రీ రెడ్డి అడుగు.. అక్కడ కూడా అవే
ఇటీవలే మరో సోషల్ మీడియా ఖాతా ఇన్స్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది శ్రీ రెడ్డి. అలా ఓపెన్ చేసిందో లేదో అందులో అన్నీ తన ఫొటోలతో నింపేసింది. ఈ ఖాతాకు కూడా నెటిజన్ల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తుండటం గమనించదగిన విషయం.
Recommended Video
క్లైమాక్స్లో శ్రీ రెడ్డి..
ఇక మరికొద్ది రోజుల్లో క్లైమాక్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీ రెడ్డి. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.