twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిశా హత్యకేసుపై శ్రీ రెడ్డి రియాక్షన్.. రేపిస్టుల కారణంగా తల్లిదండ్రుల్లో ఆలోచనలంటూ పోస్ట్

    |

    హైదరాబాద్‌లో జరిగిన దిశా హత్య ఘటన యావత్ భారత దేశాన్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా జనం ఈ హత్యను ఖండిస్తున్నారు. మానవ మృగాల రాక్షసత్వానికి బలైన వెటర్నరీ డాక్టర్ తరుపున యావత్ లోకం నిరసరస జ్వాలలు రగుల్చుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తాజాగా ఈ దుర్ఘటనపై శ్రీ రెడ్డి స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.

     శ్రీ రెడ్డి రూటే సపరేటు.. కానీ!

    శ్రీ రెడ్డి రూటే సపరేటు.. కానీ!

    సాధారణంగా శ్రీ రెడ్డి రూటే సపరేటు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియా ఖాతాలు తెరిస్తే చాలు అంతా ఎలాంటి సందేశాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంగతెలా ఉన్నా ఆమెకు ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. కాగా ఇటీవల జరిగిన దిశా ఘటనపై శ్రీ రెడ్డి స్పందించిన తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

    ఒక్కప్పుడు పేరెంట్స్ అంటూ సందేశం

    ఒక్కప్పుడు పేరెంట్స్ అంటూ సందేశం

    ''ఒక్కప్పుడు పేరెంట్స్ కడుపులోనే బిడ్డను చంపేసేవారు. కడుపులో పెడుతోంది ఆడపిల్ల అని తెలిస్తే ఇలా చేసేవారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులనే తీసుకొస్తున్నారు రేపిస్టులు. వాళ్ళు చేసే పనులు చూసి పేరెంట్స్ మళ్ళీ ఆ ఆలోచనలో పడే పరిస్థితులు కల్పిస్తున్నారు'' అంటూ కాస్త పవర్‌ఫుల్ సందేశమే పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.

    నెటిజన్ల స్పందన.. భవిష్యత్‌లో ఆడవాళ్లు

    నెటిజన్ల స్పందన.. భవిష్యత్‌లో ఆడవాళ్లు

    శ్రీ రెడ్డి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. శ్రీ రెడ్డి చెప్పిన దాంట్లో ఆలోచించాల్సిన విషయం ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఆడవాళ్లను మ్యూజియంలో చూడాల్సిన దుస్థితి వస్తుందని అంటున్నారు నెటిజన్లు.

    శ్రీ రెడ్డి అడుగు.. అక్కడ కూడా అవే

    ఇటీవలే మరో సోషల్ మీడియా ఖాతా ఇన్స్‌స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది శ్రీ రెడ్డి. అలా ఓపెన్ చేసిందో లేదో అందులో అన్నీ తన ఫొటోలతో నింపేసింది. ఈ ఖాతాకు కూడా నెటిజన్ల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తుండటం గమనించదగిన విషయం.

    Recommended Video

    #CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
    క్లైమాక్స్‌లో శ్రీ రెడ్డి..

    క్లైమాక్స్‌లో శ్రీ రెడ్డి..

    ఇక మరికొద్ది రోజుల్లో క్లైమాక్స్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీ రెడ్డి. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

    English summary
    Tollywood Sensational star Sri Reddy comented on Disha Murder Case. She put a post on this issue in her Facebook account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X