మళ్ళీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. తొడలపై చేయి వేసే బీజేపీలోకి కరాటే కళ్యాణి.. పీక కోస్తానని వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో కరాటే కళ్యాణి అంటూ తెలియనివారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రల్లో ఫేమస్ అయిన కరాటే కళ్యాణి ఈ మధ్య మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీ రెడ్డితో ఆమె వివాదం మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. తాజాగా నటి శ్రీరెడ్డి కరాటే కళ్యాణి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

బీజేపీలో
తెలుగు సినిమాలలో అనేక పాత్రలు పోషిస్తూ దాదాపు ఆమె చాలా సినిమాల్లో నటించింది. స్వతహాగా హరికథా కళాకారిణి అయిన ఆమె పాటలు కూడా పడుతుంది. మరోపక్క కరాటేలో నైపుణ్యం సంపాదించిన ఆమెకు బ్లాక్ బెల్ట్ కూడా అందుకుంది. నటన మీద ఆసక్తితో ఆమె సినిమాల్లోకి వచ్చిన ఆమె చత్రపతి, కృష్ణ, మిరపకాయ్, బ్లేడ్ బాబ్జి, గోదావరి, శంకర్ దాదా ఎంబిబిఎస్, గుంటూరు టాకీస్, అదిరిందయ్యా చంద్రం లాంటి సినిమాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు దక్కాయి. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆవిడ టీవీ సీరియల్స్ కూడా చేసింది. ప్రస్తుతానికి బీజేపీలో చేరిన ఆమె రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చూస్తుంది.

సంచలన ఆరోపణలు
అయితే కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేసింది. శ్రీ రెడ్డి ఎందుకు రఘురామ కృష్ణం రాజు, పవన్ కళ్యాణ్ లాంటి వారిని టార్గెట్ చేస్తుందని ప్రశ్నించగా ఇలాంటి వాళ్లని పట్టించుకుంటున్నాం అని తెలిస్తే వాళ్లు ఏదైనా మాట్లాడతారని వాళ్ల గురించి మాట్లాడటమే వేస్ట్ అని అన్నారు. వాళ్లకి ఫేమ్ కావాలని వాటిని రకరకాలుగా తెచ్చుకుంటున్నారని అన్నారు. తనకు ఒక డైరెక్టర్ చెప్పారని, ఆమె వెళ్లి అతని తొడపై కూర్చుంటుందని, అలా కూర్చుని ఎక్కడెక్కడో చేతులు వేస్తుందని అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

పిల్లి పిల్లల్ని పెట్టి పది ఇళ్ళు తిరిగినట్టు
అంతే కాక అలా చేసి వీడియోలు తీసి కోట్లు కోట్లు డబ్బులు డిమాండ్ చేస్తారని అలా ఆ డబ్బులతో పిల్లి పిల్లల్ని పెట్టి పది ఇళ్ళు తిరిగినట్టు ఇక్కడ తరిమేస్తే అక్కడ.. అక్కడ తరిమేస్తే ఇక్కడకి తిరుగుతూ ఉంటుందని ఆరోపించారు. నన్ను రెండు మూడు సార్లు తిట్టింది.. కేసులు కూడా నడుస్తున్నాయన్న ఆమె పేరు తీయడం నాకు అనవసరం అని పేర్కొంది.

తొడల మీద చేతులేసి
అయితే ఈ అంశం మీద తాజాగా స్పందిస్తూ శ్రీ రెడ్డి ఆమె మీద దారుణమైన కామెంట్స్ చేసింది. ఆమె ఎప్పుడో నన్ను కుక్కతో పోల్చిందన్న శ్రీ రెడ్డి నిజానికి నేను విశ్వాసం ఉన్న కుక్కని కానీ ఆమె పిచ్చి కుక్క. ఇలాంటి పిచ్చి కుక్కకి బీజేపీ పార్టీ ఎందుకు ఆశ్రయం ఇచ్చిందో తెలియడం లేదని పేర్కొంది. అంతే కాక ఆమె నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి బీజేపీలోకి తెచ్చుకున్నారో.. ఎవరితో రాసుకుని పూసుకుని కమిట్మెంట్స్ జరిగాయో అని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె అవి నైట్ కమిట్మెంట్సో లేక పగలు కమిట్మెంట్సో తెలియాలని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Recommended Video

నాలుకే కాదు.. పీక కూడా కోస్తా'
చండాలమైన బుద్ధి ఉన్న నువ్వు హిందూయిజం గురించి మాట్లాడతావా? అని ప్రశ్నించిన ఆమె నేను తొడలపై చేతులు వేసి మాట్లాడటం నువ్వు చూశావా?? నువ్వు ఎంతమంది తొడలపై చేయి వేసి ఈరోజు బీజేపీలో చేరావు? సాలు నీకు సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాక నువ్వు నా చేతికి దొరక్కపోవు.. అప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్లో వేయించకపోతే చూడు,ఇంకోసారి నా జోలికి వస్తే నాలుకే కాదు.. పీక కూడా కోస్తా' అంటూ శ్రీ రెడ్డి కరాటే కళ్యాణికి వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











