Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరింత రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. ఆ ఇద్దరికీ *** రిలేషన్ అంటూ బూతు పురాణం!
హాట్ ఆటం బాంబ్ శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. తనపై కేసు పెట్టిన నటి కరాటే కళ్యాణి, కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆ ఇద్దరికీ లింకు ఉందని పేర్కొంటూ మాటల్లో చెప్పలేని బూతుపురాణం ముందు పెట్టింది. దీంతో మరోసారి ఈ అంశం వార్తల్లో నిలిచింది. ఇంతకీ శ్రీ రెడ్డి చేసిన ఆ కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..
ముదిరిన వివాదం.. శ్రీ రెడ్డిపై పోలీస్ కేసు
గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్- శ్రీ రెడ్డి- కరాటే కళ్యాణి మధ్య నడుమ నడుస్తున్న వివాదం ముదురుతూ వస్తోంది. ఒకరిపై ఒకరు రెచ్చిపోయి కామెంట్స్ చేసుకుంటూ గత పది రోజులుగా రచ్చ రచ్చ చేస్తున్నారు. చివరకు ఈ వివాదం పోలీస్ స్టేషన్కి చేరింది. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలు శ్రీ రెడ్డిపై పోలీస్ కంప్లైంట్ చేశారు. దీంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది.
బూతుల వర్షం.. పోలీస్ స్టేషన్లో మ్యాటర్
శ్రీ రెడ్డి వర్సెస్ కరాటే కళ్యాణిల మధ్య వార్ కొనసాగుతుండగా, మధ్యలో కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ సైతం చేరి శ్రీ రెడ్డిని టార్గెట్ చేయడంతో వీరి మధ్య మాటల యుద్ధం మొదలై బూతుల వర్షం కురిస్తోంది. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ చివరకు ఈ ఇష్యూను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు.
మాటల్లో చెప్పలేని బూతు పదజాలం
దీంతో
తనపై
నమోదు
చేసిన
కేసును
వెనక్కితీసుకోవాలని
పేర్కొంటూ
మరోమారు
కరాటే
కళ్యాణి,
రాకేష్
మాస్టర్
లపై
విరుచుకుపడింది
శ్రీ
రెడ్డి.
ఆ
ఇద్దరికీ
లింకు
పెడుతూ
సంచలన
కామెంట్స్
చేసింది.
ఆ
ఇద్దరికీ
వార్నింగ్
ఇస్తూ
షాకింగ్
పోస్ట్లు
వదిలింది.
ఆ
పోస్టుల్లో
మాటల్లో
చెప్పలేని
బూతు
పదజాలం
వాడింది.
శ్రీ రెడ్డి వార్నింగ్.. పరువు నష్టం దావా వేస్తా
తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఓ వీడియో వదిలిన శ్రీరెడ్డి.. ‘కరాటే కళ్యాణి గారూ బాగున్నారండీ.. రాకేష్ బాబాయ్ బాగున్నారా? ఏంటి.. నా మీద కేసు పెట్టారంట కదా.. భలే పాపులర్ చేస్తున్నారుగా.. నన్ను పాపులర్ చేయడం అంటే రాకేష్కి, కళ్యాణికి బాగా ఇష్టం కదా థాంక్యూ. ఇప్పుడు విషయం ఏంటంటే.. కేసును మర్యాదగా వెనక్కి తీసుకోకపోతే రివర్స్లో పరువు నష్టం దావా వేస్తా' అంటూ వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.
రాకేష్ మాస్టర్కి ఎయిడ్స్.. రెచ్చిపోయిన శ్రీ రెడ్డి
అంతటితో ఆగక రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలపై సెన్సషనల్ పోస్టులు పెట్టింది. రాకేష్ మాస్టర్, కళ్యాణిలకు సంబంధం అంటగడుతూ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. రాకేష్ మాస్టర్కి ఎయిడ్స్ అంటూ షాకింగ్ విషయాలు చెప్పడంతో ఈ పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇన్ డైరెక్ట్గా ఆ ఛానల్స్ పేర్లను ప్రస్తావిస్తూ..
బండ బూతులు తిడుతూ రాయడానికి వీలు లేని పదాలు వాడుతూ మరికొన్ని పోస్టులు పెట్టింది శ్రీ రెడ్డి. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కూడా వార్నింగ్ ఇచ్చింది. పులిహోర, దద్దోజనం, సోషల్ వేస్ట్, మిర్రర్ లో తొర్రి అంటూ ఇన్ డైరెక్ట్గా ఆ ఛానల్స్ పేర్లను ప్రస్తావిస్తూ కేసులకు రెడీగా ఉండండి అంటూ హెచ్చరించింది శ్రీ రెడ్డి.
Recommended Video
తూ బతుకు.. పోలీసులు పట్టుకున్న***
పేకాటలో పోలీసులు పట్టుకున్న*** నిన్ను చూసి నేను డ్రెస్సింగ్ స్టైల్ నేర్చుకున్నానా? తూ బతుకు అంటూ మరింత రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఇక చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం పోతుందో!.