Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విడిపోయిన అమ్మా నాన్నలను కలపడం తప్పని తెలుసుకున్నా: శృతి హాసన్
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్. తనపై ఎన్ని రూమర్లు వచ్చినా ఏ మాత్రం లెక్క చేయని ఈ బ్యూటీ ఉన్న ఒక్క జీవితాన్ని ఇష్టం ఉన్నట్లుగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా అనుభవించాలని చెబుతోంది. అయితే విడిపోయిన తన తలిదండ్రులను కలపాలని శృతి హాసన్ చాలా సార్లు ప్రయత్నం చేసిందట. ఇటీవల ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి ఆమె స్పందించారు.
తండ్రి సపోర్ట్ లేకుండానే..
కమల్ హసన్ నటనలో లోక నాయకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే కమల్ హసన్ తన కూతురిని కూడా అలానే నేర్చుకునేలా చేశారు. తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ ఆయన సపోర్ట్ లేకుండానే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
మల్టీ టాలెంటెడ్..
దాదాపు సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అంతకంటే ముందే.. మ్యూజిక్ ద్వారా అమ్మడు తన టాలెంట్ ని బయటపెట్టింది. ఈనాడు సినిమా కోసం సొంతంగా ట్యూన్ చేసి రిలీజ్ చేసిన పాటకు మంచి గుర్తింపు దక్కింది. అప్పుడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
అమ్మనాన్నలు విడిపోవడం మంచిదే..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన అమ్మనన్నాల గోడవపై స్పందించింది. శృతి మాట్లాడుతూ.. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చాలా సార్లు గోడవపడేవారు. ఎన్నో పనులు చేసుకొని ఇంటికి వస్తే కూడా వివాదాలు ఉంటే.. మనిషిగా మనం ప్రశాంతతను కోల్పోతాము. రోజు ఆ విధంగా ఇబ్బందులు పడుతూ ఉండడం కంటే విడిపోవడమే మంచిదని శృతి వివరణ ఇచ్చింది.
Recommended Video
తప్పు చేశాను..
అమ్మ నాన్నల విషయంలో చాలా సార్లు కొన్ని తప్పులు చేశానని చెబుతూ.. వారి మధ్య గొడవలు ఎక్కువైనా సందర్భాల్లో వారిని కలపడానికి ప్రయత్నం చేశాను. నిజంగా అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అర్ధ అయ్యింది. ఒక మనిషితో కలవడం మరో వ్యక్తికి ఇష్టం లేనప్పుడు మనం ఒకటి చేయాలని అనుకోవడం మన స్వార్ధమే అవుతుంది. వారికి ఇష్టం ఉన్నట్లుగా జీవించడమే ఉత్తమం అంటూ శ్రుతి హాసన్ తెలిపింది.