Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మరో అవతారమెత్తిన రాజమౌళి.. కొడుకులు చేసింది కట్ చేస్తాడట.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకున్నదే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. అందుకే ఈయన వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా రాజమౌళి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
అన్నీ సూపర్ హిట్లే
రాజమౌళి ఇప్పటి వరకు 11 సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అన్ని సినిమాలూ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్తో మూడేసి సినిమాలు, రామ్ చరణ్, రవితేజ, సునీల్, నితిన్, నానిలతో ఒక్కో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గానే పేరు తెచ్చుకున్న రాజమౌళి.. టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
అన్న కొడుకుల తొలి ప్రయత్నం
రాజమౌళి సోదరుడు ఎమ్ ఎమ్ కీరవాణి కుమారులిద్దరూ టాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న ‘మత్తు వదలరా' అనే సినిమా ద్వారా ఆయన చిన్న కుమారుడు సింహా కోడూరి హీరోగా పరిచయం అవుతుండగా, సింగర్ కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్గా తొలి ప్రయత్నం చేయబోతున్నాడు.
జూనియర్ సహాయంతో మొదలు
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. అంతేకాదు, తన సోదరులిద్దరూ సక్సెస్ అవ్వాలని ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇంట్రస్టింగ్గా డిజైన్ చేశారు. న్యూసెన్స్ పేరుతో ఉన్న వార్త పత్రికలో శ్రీ సింహను హీరోగా పరిచయం చేస్తున్నట్టుగా వార్తతో పాటు ఆశ్యర్యం వక్తం చేస్తున్న ఎన్టీఆర్ స్టిల్, బ్లడ్ షేడ్స్తో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
మరో అవతారంలో రాజమౌళి
ఈ సినిమా కోసం రాజమౌళి ఎడిటర్గా మారారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. తన సోదరుల కుమారులు చేస్తున్న సినిమా కావడంతో జక్కన్న దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారట. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ గ్యాప్లో ‘మత్తు వదలరా'కు కత్తిరింపులు జరపబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
Recommended Video
భారీ చిత్రంతో జక్కన్న
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి ‘RRR' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.