Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్, రాంచరణ్తో రాజమౌళి మొదలుపెట్టాడు.. మళ్లీ బాహుబలి టీమ్తో జక్కన్న!
Recommended Video
బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. RRR అంటే రామ రావణ రాజ్యం అనే టైటిల్ ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవలే ఘనంగా జరిగింది. తాజాగా సినిమా సెట్స్పైకి వెళ్లింది. ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ సందర్భంగా రాజమౌళి, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..
RRR షూటింగ్ ప్రారంభం
RRR సినిమా షూటింగ్ను సోమవారం (19 నవంబర్) ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ను పదికిపైగా రోజులు జరిపే అవకాశం ఉంది. రాజమౌళి చిత్రీకరిస్తున్న సన్నివేశాల కోసం ఎన్టీఆర్, రాంచరణ్ హాజరయ్యారు. ఆ సందర్భంగా క్లిక్ అనిపించిన ఫొటో ఇది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ముగ్గురు హీరోయిన్లతో
RRR చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో రాజమౌళి ఉన్నారు. తాజాగా దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవిని ఈ చిత్రంలో నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి జాహ్నవి కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ధడక్ చిత్రం ద్వారా జాహ్నవి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.
|
బాహుబలి సినిమా టీమ్
ఇక RRR సినిమా టెక్నీషియన్ల విషయానికి వస్తే బాహుబలి సినిమాకు పనిచేసిన వారే పనిచేస్తున్నట్టు సమాచారం. కథ విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండగా, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కేకే సెంథిల్ కుమార్, సంగీతం ఎంఎం కీరవాణి, ప్రొడక్షన్ డిజైనర్గా సాబు సిరిల్, క్యాస్టూమ్ డిజైనర్గా రమ రాజమౌళి, డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు.
ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రాన్ని రూ.300 కోట్లతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నది.