Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
SSMB 28: త్రివిక్రమ్ సినిమాలో మహేశ్కు హీరోయిన్ ఫిక్స్: ఊహించని భామను సెట్ చేసిన గురూజీ
ఈ మధ్య కాలంలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ ఫామ్లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని విజయాలను అందుకోవాలని అతడు ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నోసినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తోన్నాడు. ఇది ఫస్ట్ షెడ్యూల్ను మాత్రమే పూర్తి చేసుకుంది. అయినప్పటికీ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమాను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పటి నుంచే.. దీనిపై ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోయిన్లు సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుందట. ఇటీవలే దీని గురించి గురూజీ ఆమెతో కథా పరమైన చర్చలు జరిపారని.. ఇది ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందని ఫిలిం నగర్లో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.
భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన ఎవరు నటిస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.